ప్రియవ్రతుడు, స్వాయంభువ కుమారుడు.ఇతని సోదరుడు ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు చిన్నతనం నుండే నుండి భక్తి భావాలతో పెరిగి, వైరాగ్య సంపత్తిని పొందాడు. ఇతని గురువు నారద మహర్షి.ప్రియవ్రతుడుని, నారద మహర్షి గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేసాడు.ఒకరోజున స్వాయంభువు పెద్దకుమారుడు అగుటవలన ప్రియవ్రతుడు దగ్గరికి వెళ్లి నీకు పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నీ తోడబుట్టిన ఉత్తానపాడుడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగాలందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళతాను. అందుకని నీవు వచ్చి రాజ్యమును స్వీకరించి,రాజ్యపాలన చేపట్టి నామీద ఉన్న భారాన్ని తొలగించమని అడుగుతాడు. నారద మహర్షి దగ్గర  జ్ఞానం, భక్తిని పొందిన చిన్నతనం నుండి వైరాగ్యంతో ఉన్న ప్రియవ్రతుడు తండ్రి రాజ్యాన్ని స్వీకరించమంటే స్వీకరించడు.[1]

ప్రియవ్రతుడు

రాజ్యపాలన నిరాకరించుట మార్చు

ప్రియవ్రతుడు నాకు ఈ ప్రకృతి సంబంధం, దీని బంధనం గురించినాకు బాగా తెలుసు. ఈ శరీరంలోకి  జీవం ప్రవేశించింది బంధనాలు పెంచుకుని, అవిద్యయందు, కామ క్రోధములందు, అరిషడ్వర్గములందు కూరుకుపోవడానికి ఎంతమాత్రం కాదు. పైగా ఒకసారి నేను రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే, నా అంతట నేను నాకు తెలియకుండానే గోతిలో పడిపోతాన కనుక, నాకు రాజ్యం అక్కరలేదు, నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటానని, భగవంతుడి గురించి తపిస్తానని, తండ్రి స్వాయంభువుతో చెపుతాడు.ఈ మాటలు చతుర్ముఖ బ్రహ్మ గ్రహించి వెంటనే గబగబా కదిలి వీరిద్దరి దగ్గరకు చేరుకుంటాడు. [1]

చతుర్ముఖ బ్రహ్మ ఉపదేశం మార్చు

పురాణం ప్రకారం చతుర్ముఖ బ్రహ్మ ప్రజోత్పత్తిని చేసి,రాజ్యపరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వాయంభువు మనువును బ్రహ్మ సృష్టించాడు.ఇపుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అదే జరిగితే లోకంలో కట్టుబాటు పోతుందని బ్రహ్మ గ్రహించాడు.దాని వలన  గృహస్థాశ్రమం నందు ప్రవేశించడమనేది అత్యంత ప్రమాదకరమైన చర్య కాబట్టి దానియందు ప్రవేశించరాదనే అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్ర చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదని ఇవన్నీ ఆలోచించి బ్రహ్మ వారిదగ్గరికి వెళ్లాడు.[1]

బ్రహ్మ ప్రియవ్రతుడుతో నీ అంతట నీవు సంసారబంధాలలో ప్రవేశించనని ఒక నిర్ణయానికి వస్తున్నావు. నీకు,నాకు సమస్త లోకపాలురకు ఎవరి వాక్కు అయినా శిరోధార్యం అనే ప్రమాణం ఏమీ లేదు.ఇదియే ప్రమాణం అని చెప్పటానికి వేదమే ప్రమాణం అయి ఉంటుంది. ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు. వేదం ప్రమాణం కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదం కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరిస్తాం.కావున నీ నిర్ణయం మార్చుకుని నీ తండ్రి కోరిన ప్రకారం నడుచుకోవలసిందిగా బ్రహ్మ ఉపదేశిస్తాడు.[1]

బ్రహ్మదేవుడు ఇంకా గృహస్థాశ్రమ విశిష్టతను, దాని అవసరాలను, మేలును వివరించి వివాహం చేసుకొని, గృహస్థాశ్రమంలో నుండి అంతశ్శుత్రువులను గెలిచి, ధర్మపధాన రాజ్యపాలన చేసి, చివరకు ఆత్మనిష్ఠలో నుంచి మోక్షంను పొందవచ్చునని బోధిస్తాడు

బ్రహ్మ ఉపదేశం పాటించుట మార్చు

ఎట్టకేలకు చివరకు ప్రియవ్రతుడు బ్రహ్మ ఉపదేశం అంగీకరిస్తాడు. స్వాయంభువమనువు అఖిలభూమండలానికి ప్రియవ్రతుని రాజుగా అభిషేకించి, తాను విరక్తుడై పరమార్ధసాధనపొందుతాడు. ప్రియవ్రతుడు బ్రహ్మ ఉపదేశమున రాజ్యభారం వహించి, మనస్సు నిత్యం భగవంతునిపై నుంచుచూ, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తాడు.

వివాహం, సంతానం మార్చు

బ్రహ్మ మాటలు విని విశ్వకర్మ ప్రజాపతి కుమార్తెయగు బర్హిష్మతిని వివాహం చేసుకుంటాడు.[2] బర్హిష్మతిని వివాహమాడి పదిమంది కుమారులను ఒక కుమార్తెను, మరియొక భార్యకు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను ముగ్గురు కుమారులకు జన్మిస్తారు.[3]

సప్తసముద్రాలు, సప్తద్వీపాలు సృష్టింపు మార్చు

ప్రియవ్రతుడు తన పాలనలో ఉత్తమరధం నారోహించి సూర్యుని వెంట ఏడు మారులు తిరుగగా, సప్తసముద్రాలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాల మధ్యలో జంబూ, పక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మల పుష్కరం అనే సప్తద్వీపములు ఏర్పడ్డాయి. అరిషడ్వర్గంలను జయించి భగవంతుని మనస్సుతో నిండుకొని ఉత్తమపురుషుడైన ప్రియవ్రతుడు ఇంతటి గొప్ప ప్రభావంలుండుటచేత, ఇట్టి మహత్తర కార్యములను సాధించి అనేక వేల సంవత్సరాలు రాజ్య పాలనచేసి కుమారుడైన ఆగ్నీధ్రునకు పట్టాభిషేకం చేసి సర్వసంగ పరిత్యాగియై కృతార్థుడయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "పంచమ స్కంధము - ప్రియవ్రతుని చరిత్ర". Srivenkatesham. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  2. Kumar, Pulluru Shravan (2017-12-11). "Bhagavatham: Priyavrathudu". Bhagavatham. Retrieved 2020-07-12.
  3. 3.0 3.1 http://www.kamakoti.org/telugu2/34/5chapters.htm

వెలుపలి లంకెలు మార్చు