బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ

బడంగ్‌పేట నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 13 నగరపాలక సంస్థలలో ఇది ఒకటి.ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో, హైదరాబాదు మహానగరపాలసంస్థకు సమీపంలో ఉంది. ఇది 2013 మార్చి 26 న 1. బడంగ్‌పేట్ 2. అల్మాస్‌గూడ 3. నాదర్‌గల్ 4. కుర్మల్‌గూడ 5. గుర్రమ్‌గూడ 6. బాలపూర్ (భాగం) 7. వెంకటాపూర్, 8. మామిడిపల్లి ఎనిమిది పూర్వ గ్రామాలు విలీనంతో నగర పంచాయితీగా ఏర్పడింది. నగరపంచాయతీ స్థాయి నుండి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడింది. ఎనిమిది గ్రామాల యుఎల్‌బి వైశాల్యం 74.56 చ. కి.మీ. దీని ముఖ్య పట్టణ బడంగ్‌పేట్ .

బడంగ్‌పేట్
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
నాయకత్వం
మేయర్
సిఎచ్.పి.నరసింహారెడ్డి
2020 సాధారణ ఎన్నికలు నుండి
డిప్యూటీ మేయరు
ఇ.శేఖర్
కమీషనర్
ఇసాక్‌ఖాన్‌
నిర్మాణం
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
బడంగ్‌పేట్ నగరపాలకసంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్
పంచాయతీ కార్యాలయం, బడంగ్‌పేట్

జనాభా గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 64579. ప్రస్తుతం ఇది 100000 జనాభాగా అంచనా వేయబడింది.బడంగ్‌పేట అనే పేరు దక్కన్ సుల్తానేట్ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బడంగి అనే పాలకుడి నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్వపు గ్రామంలో బటన్ గుత్తా (కావలికోట) కోట గోడలు, కాశిబుగ్గ అనే పురాతన శివ - విష్ణు ఆలయం, ఇతర అందమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి.

పరిపాలనా నిర్వహణ మార్చు

కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థలో పరిపాలన నిర్వహణకు వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఐదుగురు ఉన్నత అధికారులును నియమించారు.నగరపాలక సంస్థలో వివిధ శాఖలలో పనిచేయటానికి అవుట్ సోర్స్ంగ్ ఉద్యోగులు 170 మందిని నియమించారు.నగరపాలక సంస్థకు 2020 జనవరిలో జరిగే సాధారణ ఎన్నికలకు నగరపాలక సంస్థను 32 వార్డులుగా విభజించారు.[1] పౌరసంఘం కింద 98,038 మంది ఓటర్లు ఉన్నారు.[2]

మేయర్ , డిప్యూటీ మేయర్ మార్చు

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (యు.ఆర్.డబ్ల్యు రిజర్వుడు) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన చిగిరింత పారిజత నరసింహరెడ్డి ఎన్నికయ్యాడు. అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇబ్రమ్ శేఖర్ ఎన్నికయ్యాడు.[3]

అభివృద్ధి పనులు మార్చు

నగర శివారు ప్రాంతాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో రూ. 1200 కోట్లతో 250 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న మంచినీటి పైపులైన్‌ లో భాగంగా బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ పరిధి 28వ డివిజన్‌లోని సప్తగిరి కాలనీలో పైపులైన్‌ పనులకు 2022 మార్చి 14న రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రమ్ శేఖర్‌, స్థానిక కార్పోరేటర్‌ సూర్ణగంటి అర్జున్‌, కార్పోరేటర్లు, మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు, వాటర్‌ వర్క్స్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.[4]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-18. Retrieved 2020-04-16.
  2. Jan 14, Nabinder Bommala | TNN | Updated:; 2020; Ist, 08:58. "Battle of Badangpet: 158 in fray for 32 wards | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2020-04-15. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. https://tsec.gov.in/pdf/munc_corp/2020/Mayer_chairperson_MC_1427.pdf
  4. telugu, NT News (2022-03-14). "ప్రతి ఇంటికి మంచినీరు.. సీఎం సంకల్పం". Namasthe Telangana. Archived from the original on 2022-03-15. Retrieved 2022-03-15.

వెలుపలి లంకెలు మార్చు