బాలల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలల అకాడమీ స్థాపించింది. పిల్లలకు సంబంధించిన సాహిత్యం, కళ, పఠనాంశాలను అభివృద్ధి పరచి బాలలకు అందుబాటులోకి తెచ్చేందుకు 1976, మార్చి నెలలో ఈ అకాడమీ స్థాపించబడింది. ఇది బాలల సాహిత్యాభివృద్ధికి చాలా కృషి చేసింది.[1][2]

1976లో అప్పటి భారతరాష్ట్రపతి ఫ్రకృద్ధీన్ ఆలీ అహమ్మద్ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాసాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి మండలి వెంకటకృష్ణారావు దానికి తొలి అధ్యక్షునిగా వ్యవహరించాడు. దీనికి కార్యదర్శిగా రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవ రావు ఉన్నారు.

ఈ అకాడమీ మార్చి 1979 నుండి బాల చంద్రిక అనే బాలల బొమ్మల మాసపత్రికను ప్రచురిస్తున్నారు. ఇందులో బాలల వినోదానికి, విజ్ఞానానికి, వికాసానికి తోడ్పడే కథలు, వ్యాసాలు, గేయాలు ఉంటాయి.

అకాడమీ కార్యకలాపాలు

మార్చు
  • పిల్లలలోని సృజనాత్మక శక్తులను ప్రోత్సహించి వాటిని బయల్పరచడం.
  • బాలలలో అంతర్గతంగా ఉన్న తెలివి తేటలను పదును పెట్టే పుస్తకాలను ప్రచురించడం.
  • వారికి అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు నెలకొల్పడం.

మూలాలు

మార్చు
  1. "ఇవిగో బుజ్జి కథలు! అవిగో జేజిమామయ్య పాటలు!". www.teluguvelugu.in. Retrieved 2020-09-29.[permanent dead link]
  2. "పిల్లల పుస్తకం..... | కవర్ స్టోరీ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-09-29.[permanent dead link]