బ్లాగు పుస్తకం అనేది తెలుగులో బ్లాగులపై విడుదలైన మొదటి పుస్తకం. ఈ పుస్తకాన్ని తెలుగు బ్లాగరులైన సుజాత, రహ్మానుద్దీన్ లు వ్రాసారు. కంప్యూటరులో తెలుగులో టైపింగు చేయడం నుండి స్వంతంగా బ్లాగు రూపొందించి ఎలా నిర్వహించుకోవచ్చో ఈ పుస్తకంలో సవివరంగా వ్రాసారు. ప్రతీ అంశాన్నీ చక్కగా తెరపట్టులతో అంచెలవారీగా వివరించారు. బ్లాగులు సృష్టించడం, వాడటం మాత్రమే కాకుండా బ్లాగుల వలన కలిగే లాభనష్టాలు, అగ్రిగేటర్లు గురించి కూడా వ్రాసారు.

బ్లాగు పుస్తకం ముఖచిత్రం
బ్లాగు పుస్తకం ముఖచిత్రం

18 అధ్యాయాలుగా  విస్తరించిన 108 పేజీల ఈ  చిన్న పుస్తకం ఔత్సాహికులకు కరదీపికగా ఉపయోగపడేలా ఉంది. సాంకేతిక అంశాలను  స్క్రీన్ షాట్ల సాయంతో శ్రద్ధగా వివరించటం జరిగింది. బ్లాగింగులో విధి నిషేధాలు కూడా చెప్పటం వల్ల  అదనంగా విలువ సమకూరింది.

ఉదహరింపులు మార్చు