భూపేంద్ర నాథ్ బోస్

భూపేంద్ర నాథ్ బోస్ (1859 జనవరి 13 - 1924 సెప్టెంబరు13) ఇతను 1914లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వ్యవహరించిన ఒక భారతీయ రాజకీయవేత్త.

భూపేంద్ర నాథ్ బోస్
మోహన్ బగన్ ఎసి మొదటి అధ్యక్షుడు
కలకత్తా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్, బి.ఎన్. బసు అండ్ కంపెనీ (లా ఫర్మ్) (వ్యవస్థాపకుడు)
వ్యక్తిగత వివరాలు
జననం1859 జనవరి 13
రాధానగర్, హూగ్లీ, పశ్చిమ బెంగాల్
మరణం1924 సెప్టెంబరు 13
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ 1914 మద్రాస్ సెషన్‌లో అధ్యక్షుడు

బోస్ 1859 లో పశ్చిమ బెంగాల్‌లోని రాధానగర్‌లో జన్మించాడు. అతను 1880 లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1881లో మాస్టర్స్ డిగ్రీని, 1883లో లా డిగ్రీని పూర్తి చేశాడు. అతను బి.ఎన్ బోస్ అండ్ కంపెనీ అనే న్యాయ సంస్థను స్థాపించాడు. దీని కార్యాలయం ఇప్పటికీ కోల్‌కతాలోని టెంపుల్ ఛాంబర్‌లో ఉంది.

1904 నుండి 1910 వరకు, బోస్ బెంగాల్ శాసనసభ సభ్యుడుగా పనిచేసాడు.ఈ కాలంలో అతను జాతీయవాద ఉద్యమంలో పాల్గొన్నాడు.1905 లో మైమెన్సింగ్‌లో జరిగిన బెంగాల్ ప్రొవిన్షియల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించాడు.విభజన వ్యతిరేక ఆందోళనలో భాగంగా అతను బెంగాల్ అంతటా బ్రిటిష్ వస్తువులకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నాడు.1907లో, తరువాత అతని జాతీయ కార్యకలాపాల కోసం బ్రిటిష్ వారు కలకత్తాలో అరెస్టు చేసి నిర్బంధించారు. [1]1910 లో పత్రికా చట్టాన్ని ఆమోదించడాన్ని వ్యతిరేకించాడు.1914 లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. బోస్ 1917 నుండి 1923 వరకు భారత రాష్ట్ర కార్యదర్శి మండలిలో సభ్యుడు, అండర్ సెక్రటరీగా ఉన్నాడు. 1923 లో బెంగాల్ గవర్నర్ నిర్వహణ సంఘం సభ్యుడుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యాడు. అతను మోహన్ బగన్ ఎ.సి.కలకత్తా మొదటి అధ్యక్షుడు. [2] అతను 1924 లో మరణించాడు. 

మూలాలు మార్చు

  1. Raja Subodh Chandra Mallik and his times by Amalendu De, National Council of Education, Bengal - Page 96, 1996
  2. Mohun Bagan History Archived 24 ఫిబ్రవరి 2008 at the Wayback Machine

వెలుపలి లంకెలు మార్చు