మరుపూరు కోదండరామారెడ్డి

మరుపూరు కోదండరామరెడ్డి నెల్లూరు జిల్లా మినగల్లు వాసి. తండ్రి కొండారెడ్డి, తల్లి కామమ్మ. మొత్తం ముగ్గురు అక్కలు, ఒక అన్న. కోదండరామిరెడ్డి జననం 1902 అక్టోబర్ 3వ తారీకు. కోదండరామారెడ్డి అన్న పిచ్చిరెడ్డి. ఈయన అక్క, సుప్రసిద్హ సంఘసేవిక పొణకా కనకమ్మ. కనకమ్మ 1920కల్లా దేశసేవలో పుట్టింటి ఆస్తిని, మెట్టింటి ఆస్తిన్తి వ్యయం చేయడంతో కోదండరామరెడ్డి బందరువెళ్లి జాతీయకళాశాలలో విద్యాభ్యాసం చేసి, మద్రాసులో జస్టిస్ పార్టీ పత్రిక సమదర్శినిలో చేరాడు. కోదంరామిరెడ్డి అక్క కనకమ్మ కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకొన్నాడు కానీ సంతానం కలగనందున, శంకరమ్మను పునర్వివాహం చేసుకొన్నాడు. రుక్మిణమ్మ జాతీయోద్యమంలో, దేశసేవలో గడిపి, 20సంవత్సరాలు పినాకిని సత్యాగ్రహాశ్రమంలో సేవచేస్తూ గడిపింది. కోదండరామరెడ్డి నెల్లూరులో ప్రభాత ప్రెస్ను అక్క సహాయంతో నెలకొల్పి, రంధ్రాన్వేషి పేరుతొ తెలుగు పత్రితికను కొద్దికాలం నిర్వహించాడు. కొంతకాలం నెల్లూరు వారపత్రిక జమీన్ రైతులో పనిచేసాడు. కొద్దికాలం సినిమారంగంలో ఉన్నాడు. 1954లో నెల్లూరులో మందాకినీ వారపత్రిక, దానితోపాటు మందాకిని పవర్ ప్రెస్ నెలకొల్పి దాదాపు పదేళ్లు నిర్వహించాడు.

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని మరుపూరు కోదండరామిరెడ్డి వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

కోదండరామరెడ్డి సావర్కర్ హిందూపద్ పాదుషాహిని, షిరిడీసాయిభగవాన్ మీద విదేశీయుడి రచనను, అనువదించి ముద్రించాడు. విక్టర్ హ్యూగో లే మీసరబుల్స్ ను , తమిళం నుంచి శిలప్పదికారం నవలను అనువదించి ప్రచురించాడు. శిలప్పదిగారం అనువాద నవల ఆంధ్రప్రేదేశ్ ఎస్.ఎ.స్ఎల్. సి పరీక్షల్లో ఉపవాచకంగా నిర్దేశించబడడంతో అనేక ముద్రణలు పొందింది.

కోదండరామరెడ్డి రాజాజీ నెలకొల్పిన అప్పటి ప్రతిపక్ష పార్టీ స్వతంత్రపార్టీ రాజకీయాలను, విధానాలను సమర్ధించడానికి మందాకిని పత్రికను కొనసాగించాడు. నెల్లూరులో జమీన్ రైతు కాంగ్రెస్ రాజకీయాలను సమర్ధిస్తే, ఈయన ప్రతిపక్షాన్ని సమర్దిస్తు మందాకినిని  కొనసాగించాడు. 

నార్ల వెంకటేశ్వరరావు ఇంగ్లీషులో రచించిన Vemana through westren eyes గ్రంథాన్ని వేమన-పాశ్చాత్యులు పేరుతొ అనువదించి, ముద్రించి విద్యానగర్ విద్యాసంస్థల స్థాపకుడు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డికి అంకితం చేసాడు. కోదండారంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యలుగా, విశిష్ఠ సభ్యులుగా చాల కాలం కొనసాగి సేవలందించాడు. అకాడమీ మాండలిక పదకోశానికి సంపాదకుడుగా వ్యవహరించాడు. లోకకవి వేమన వేమనమీద అయన రచన. మహాభారతంలో కర్ణుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించి 'కర్ణ' పుస్తకం రాసాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయన సాహిత్యసేవకు గుర్తింపుగా కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. కోదాండారామరెడ్డికి కవి తిక్కన భారతం అంటే చాలా అభిమానం. నెల్లూరులో తిక్కన మీద ఉపన్యాసాలు ఏర్పాటుచేసి తిక్కన తిరునాళ్ల పేరుతొ పెద్ద గ్రంథం ప్రచురించాడు. కోదండరామరెడ్డి నెల్లూరులోను, ఇతర ప్రదేశాల్లో దేశ నాయకుల ఆంగ్ల ఉపన్యాసాలను గంభీరమైన కంఠంతో చక్కని తెల్గులో అనువాదం చేశాడు. అవేదికమెడ పెద్ద పెద్ద నాయకుల ఉపన్య్సాలను అనువాదం చేశాడు. కోదండరామరెడ్డి సంభాషణా చతురుడు, హాస్య ప్రియుడు. అయన మాటల్లో రచనల్లో నెల్లూరు మాండలిక పదాలు తరచూ దొర్లుతాయి. కోదండరామరెడ్డి కొంతకాలం ఇళ్ళు కట్టి అమ్మాడు. నాడార్ ఇల్లు, కామగిరి, అపర్ణ ఇళ్ళనను గొప్ప ఈస్థటిక్ సెన్సుతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు. 11952-56 నడుమ నెల్లూరులో పెన్నమీద వంతెన నిర్మాణంలో వంగల్లు కోదండరామరెడ్డితో కలిసి స్తంభాల నిర్మాణ కాంట్రాక్టు చేసాడు. ఆయన బ్రతుకుదెరువుకు కొద్దికాలం నెల్లూరులో 'నందనం' అనే భోజన హోటల్ కూడా నిర్వహించాడు. కోదండరామరెడ్డికి ఆంధ్రదేశంలో ఎందరో మిత్రులు, ఎన్నెన్నో చోట్ల సన్మానాలు, గౌరవాలు అందుకొన్నాడు!

కోదండరామరెడ్డికి ఆశాలత, తరుణేందుశేఖర్ రెడ్డి సంతానం. కోదండరామారెడ్డి పూర్ణజీవితం గడిపి 92వ ఏట అశువులుబాశాడు. మూలాలు: 1. కోదండరామిరెడ్డి ముద్రిత గ్రంథాలు, 2. మందాకిని, జమీన్ రైతు వారపత్రికలు, 3. నెల్లూరు జిల్లా సర్వస్వము, 4. పొణకా కనకమ్మ స్వీయచరిత్ర కనకపుష్యరాగం,2011. 5. విగ్జానసర్వస్వము, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ,1988.