మహామస్తకాభిషేకం

మహామస్తకాభిషేకం జైన మతంలో ముఖ్యమైన పండుగ. దీనిని కర్ణాటక రాష్ట్రం లోని శ్రావణబెళగొళలో నెలకొని ఉన్న గోమఠేశ్వరుని విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. ఈ పండగను 17.3736 metres (57.000 ft) ఎత్తు ఉన్న జైనమత సిద్ధుడు బాహుబలి విగ్రహారాధన కొరకు చేస్తారు. 2006 లో గోమఠేశ్వరునికి మహామస్తమాభిషేకం జరిగింది. తరువాత 2018 లో జరుగుతుంది.[1]

మహామస్తకాభిషేకం
{{{holiday_name}}}
గోమఠేశ్వరునికి అభిషేకం
యితర పేర్లుఅనువాదం: తలపైనుండి గోమఠేశ్వరునికి అభిషేకం
జరుపుకొనేవారుజైనులు
రకంమతపరమైనది
ప్రాముఖ్యతగోమఠేశ్వరుని విగ్రహం పూర్తి
జరుపుకొనే రోజుజైన కాలెండరులో లూని-సోలార్ చే నిర్ణయించబడుతుంది
ఉత్సవాలుగోమఠేశ్వరుని విగ్రహానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం
వేడుకలుప్రార్థనలు, మత సంస్కారాలు

విశేషాలు మార్చు

2018 ఫిబ్రవరి మొదటి వారంలో శ్రావణబెళగోళలోని బాహుబలికి మహామస్తకాభిషేకం నిర్వహిస్తామని శ్రావణబెళగోళ పీఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామీజి తెలిపారు. సా.శ918లో 58.8అడుగుల ఎత్తు ఉన్న బాహుబలి విగ్రహాన్ని (ఏక శిలావిగ్రహం) గంగా సామ్రాజ్యానికి చెందిన సేనాధిపతి చావుండరాయ స్థాపించారు. అప్పటి నుండి 12 సంవత్సరాలకు ఒక సారి బాహుబలికి మహామస్తాకాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాలతో పాటు భారదేశంలోని ప్రముఖులు హాజరవుతారు. వివిధ రాష్ట్రాలలోని స్వామీజిలు, పీఠాధిపతులు, దిగంబర మునులు పాదయాత్రతో ఇచ్చటికి వస్తారు.[2]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Correspondent, TNN (8 February 2006). "Mahamastakabhisheka of Bahubali begins today". The Times of India. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 19 December 2012.
  2. బాహుబలి 58 అడుగులు: మహామస్తకాభిషేకం (వీడియో)

ఇతర లింకులు మార్చు