మైత్రాయణి ఉపనిషత్తు

మైత్రాయణియ ఉపనిషత్తు (సంస్కృత: मैत्रायणीय उपनिषद्) అనేది పురాతన సంస్కృత గ్రంథం. ఇది యజుర్వేదంలో పొందుపరచబడింది[1][2]. దీనిని మైత్రి ఉపనిషత్తు అని కూడా పిలుస్తారు. ఇది 108 ఉపనిషత్తుల ముక్తి సిద్ధాంత జాబితాలో 24 వ స్థానంలో ఉంది.[3]

మహారాష్ట్ర లోని పూణెలో దొరికిన మైత్రేయణీయ ఉపనషత్తు ప్రతిలోని ఒక పుట. (సంస్కృతం, దేవనాగరి లిపి)

ఇందు 7అధ్యాయములుకలవు. ఇందాత్మనుగురుంచి చెప్పబడినది. ఈరహస్యము ఇక్ష్వాకువంశొద్భోవుడైన బృహద్రధునకు ఉపదేశించడమైనది. ఇందు చర్చింపబడిన విషయమంతయు మూడు ప్రశ్నలలోనిముడ్పంబడియున్నది.

  1. ఆత్మ దేహములో నెట్లు ప్రవేశించును
  2. పరమాత్మ జీవాత్మ యెట్లగుచున్నది?
  3. మోక్షసాధనమెట్లు?

ఉపనిషత్తులోని మిగిలన భాగమంతయు ఖిలకాండమని చెప్పవచ్చును. ఇందు ప్రపంచోత్పత్తికగాధ గలదు. రజ,స్సత్వ, తమోగునములు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు గలవని చెప్పబడియున్నది. ఓంకారముయొక్క ప్రాముఖ్యమును గూర్చి చర్చింపబడినది. జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలేకాక బ్రహ్మకు దురీయావస్థకూడ నున్నదని చెప్పబడియున్నది.

మూలాలు మార్చు

  1. Paul Deussen, Sixty Upanishads of the Veda, Volume 1, Motilal Banarsidass, ISBN 978-8120814684, pages 327-386
  2. Charles Johnston (1920-1931), The Mukhya Upanishads, Kshetra Books, ISBN 9781495946530 (Reprinted in 2014)
  3. The Upanishads, Part II. Translated by F.Max Müller. Dover Publications, Inc. 2012. p. xliii-xliv.