మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు, [1] గాయని.

మోతే వేదకుమారి
మోతే వేదకుమారి


పదవీ కాలం
1957 - 1962
తరువాత వీరమాచనేని విమల దేవి
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1931-09-24) 1931 సెప్టెంబరు 24 (వయసు 92)
ఏలూరు, ఆంధ్రప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
మతం హిందూమతం

ఈమె ఏలూరులో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.

ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.

ఈమె ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.

మూలాలు మార్చు

  1. "Biodata of Vedakumari Mothey at Parliament of India". Archived from the original on 2016-03-04. Retrieved 2013-02-28.