రవీంద్రనాథ్ మహతో
రవీంద్రనాథ్ మహతో భారతీయ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం జార్ఖండ్ శాసనసభ స్పీకరుగా పనిచేస్తున్నాడు.[1] అతను జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన నాయకుడు. అతను 1960 సంవత్సరంలో భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని తనతండ్రి స్థానమైన పటాన్పూర్ జమ్తారాలో జన్మించాడు.అతని తండ్రి పదవీవిరమణ పొందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.ప్రస్తుతం అతను జార్ఖండ్లోని జమ్తారాలోని బరావాలో నివసిస్తున్నాడు.
రవీంద్రనాథ్ మహతో | |
---|---|
జార్ఖండ్ శాసనసభ స్పీకరు | |
Assumed office 2020 జనవరి 6 | |
Deputy | ఖాళీ |
అంతకు ముందు వారు | దినేష్ ఓరాన్ |
ఎమ్మెల్యే జార్ఖండ్ శాసనసభ | |
Assumed office 2014 డిసెంబరు | |
అంతకు ముందు వారు | సత్యానంద్ ఝా |
నియోజకవర్గం | నాలా |
In office 2005–2009 | |
అంతకు ముందు వారు | విశ్వేశ్వర్ ఖాన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పటాన్పూర్ జామ్తారా, బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్) | 1960 జనవరి 12
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
సంతానం | 2
Kunal Kanchan Yadav Priyanka |
తల్లి | రూప్ మంజరీ దేవి |
తండ్రి | గోలక్ బిహారీ మహతో |
నివాసం | బరావా, జమ్తారా, జార్ఖండ్ |
విద్య
మార్చురవీంద్రనాథ్ మహతో ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్.అతను భాగల్పూర్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్. ఒడిశాలోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి. బి.ఎడ్ కూడా పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుజార్ఖండ్లోని బరావా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతను 9 సార్లు శాసనసభ్యుడుగా విశ్వేశ్వర్ ఖాన్పై పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అతను జార్ఖండ్ ఉద్యమం సమయంలో శిబు సోరెన్తో చేరాడు, అతని నాయకత్వ నాణ్యత, సాధారణ వ్యక్తిత్వం కారణంగా అతను జార్ఖండ్ ముక్తి మోర్చాకు అనుకూలమైన నాయకుడిగా మారాడు.
తరువాత అతను 2005 సంవత్సరంలో నాలా నుండి జార్ఖండ్ శాసనసభకు తన మొదటి ఎన్నికలో గెలిచాడు, కానీ 2014, 2019 ఎన్నికలలో మళ్లీ గెలవడానికి ముందు 2009లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడు. 2019 శాసనసభ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహతో జార్ఖండ్ విధానసభకు 7వ స్పీకర్గా ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఆయన శాసనసభ పనిని మెరుగుపరచడానికి ముఖ్యమైన చర్యలు తీసుకున్నాడు.జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ గతంలో తరచుగా అంతరాయాలను ఎదుర్కొంటోంది. మహతో ప్రతిపక్ష నాయకులను బోర్డులోకి తీసుకువెళ్లారు. చర్చ, ఉపన్యాస సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఇటీవల ఇతని ఆదేశాల మేరకు జార్ఖండ్ విధానసభ 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. [2]