పూర్వం రాజుల కాలంలో రాజుని పొగడడానికి ఆనాడు రాజుల కొలుపులో ఉండేవారు.వీరు రాజు పక్కనే ఉంటూ రాజుని పొగుడుతూ ఉంటారు. ఉదయాన్నే సన్నాయి మేళాలతో చక్రవర్తి పొగుడుతూ మేల్కొలుపుతారు.వీరు వైశ్య పురుషుడికీ + క్షత్రియ స్త్రీ పుట్టిన సంతానం ఈ వందిమాగదులు.వీరి పని రాజులను పొగుడుతూ బతకడం వీరి ప్రధాన వృత్తి.వంది పూర్వ రోజుల గొప్పదనం చెప్పాడు. మాగది అప్పుడు పరిపాలిస్తున్న రాజును పొగుడుతూ ఉంటాడు.[1]

రాజులు వస్తున్న సమయంలో వందిమాగదులు రాజాధిరాజ, రాజగంభీర, దానవ సామ్రాజ్యనేత శ్రీశ్రీశ్రీ వృకాసుర మహారాజునకు విజయోస్తు అంటూ సభకు జయమును పలుకుతారు.[2]

వంది మార్చు

రాజు ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఈ రాజు కంటే ముందు పరిపాలించిన రాజుల గొప్పతనం స్తోత్రం చేస్తాడు.అప్పుడు రాజు విని ముందు రాజుల గొప్పతనాన్ని గుర్తుచేసుకుని రాజు పొరపాటు చేయకుండా ఉంటాడు. ఇలా రాజుకు గుర్తు చేయడమే వంది పని.

మాగది మార్చు

పూర్వ రాజులతో సంబంధం లేకుండా రాజు చేసిన గొప్పతనాన్ని స్తోత్రం చేస్తాడు. మాగది కేవలం రాజుని పొగడడానికి మాత్రమే ఉంటాడు. ఎవరైనా ఎక్కువ పొగడ్తలు చేస్తే వందిమాగదులు పొగడ్తలు చేయకు అని వింటూ ఉంటాం. నేడు రాజకీయ నాయకులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

మూలాలు మార్చు

  1. Ranganayakamma, Muppala (1974). Ramayana visavrksam. Svithom publications.
  2. Anuradha, B. (2019-03-05). Feminist Ambedkar. Hyderabad Book Trust.