సంగమేశ్వర ఎత్తిపోతల పథకం

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం ప్రాంతంలో నిర్మించబడుతున్న నీటిపారుదల పథకం. సింగూరు జలాశయం కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాలలోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మించబడుతోంది.[1][2] 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఇక్కడికి తరలించనున్నారు.

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం
CM KCR Laying Foundation To Sangameshwara Basaveshwara Lift Irrigation Projects.jpg
సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రదేశంజహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితినిర్మాణంలో వున్నది
నిర్మాణం ప్రారంభం2022
నిర్మాణ వ్యయంరూ. 2,653 కోట్లు
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుగోదావరి
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

ప్రారంభంసవరించు

2022, ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో ఈ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి (బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కూడా) ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఆర్థిక - వైద్యారోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, కె.మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, పద్మా దేవేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పి.వెంక‌ట్రామి రెడ్డి, శ్రీ ఫరూక్ హుస్సేన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4]

పథకం వివరాలుసవరించు

మల్లన్నసాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని సింగూరుకు తీసుకువచ్చి, అక్కడి బ్యాక్‌ వాటర్‌ నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తారు. సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, ఎల్లాపూర్‌ నుంచి మొదట నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా జహీరాబాద్‌, అందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాలోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.[5] ఈ పథక నిర్మాణంలో భాగంగా 147 మీటర్ల ఎత్తులో మూడు లిఫ్టులు, మూడు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 215 కిలోమీటర్ల మేర ఆరు కాల్వలను (రాయికోడ్‌ కెనాల్‌ (56.85 కిలోమీటర్లు), మునిపల్లి కెనాల్‌ (11.40 కిలోమీటర్లు), కంది కెనాల్‌ (44.85 కిలోమీటర్లు), జహీరాబాద్‌ కెనాల్‌(30.95 కిలోమీటర్లు), గోవిందాపూర్‌ కెనాల్‌ (19.15 కిలోమీటర్లు), హద్నూర్‌ కెనాల్‌ (51.80 కిలోమీటర్లు)) నిర్మించనున్నారు.[6] మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంతో నిర్మితమవుతున్న ఈ ఎత్తిపోతల పథక నిర్మాణానికి 6,293 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని, రూ. 2,653 కోట్లు ఖర్చవుందని, 140 మెగావాట్లు విద్యుత్తు వినియోగమవుతుందని అంచనా వేయబడింది.[7]

ఆయకట్టు వివరాలు:

మూలాలుసవరించు

  1. Velugu, V6 (2022-02-19). "సంగమేశ్వర - బసవేశ్వర పథకానికి శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.
  2. "ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డాను: కేసీఆర్‌". andhrajyothy. 2022-02-21. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  3. telugu, NT News (2022-02-21). "CM KCR | సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  4. Velugu, V6 (2022-02-21). "సంగమేశ్వర్,బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  5. "Telangana Cabinet gives nod for Sangameshwara, Basaveshwara schemes". The New Indian Express. 2022-02-20. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.
  6. "సీఎం పెట్టారు.. ఈ ఎత్తిపోతల పేర్లు". EENADU. 2022-02-20. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.
  7. telugu, NT News (2022-02-20). "కాళేశ్వర సంగమం". www.ntnews.com. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.