సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్

సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్ అలియాస్ చిమన్‌రావు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఫల్తాన్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్

ముందు విజయసింహరాజే నాయక్ నింబాల్కర్
తరువాత రామ్‌రాజే నాయక్ నింబాల్కర్
నియోజకవర్గం ఫల్తాన్

వ్యక్తిగత వివరాలు

జననం 1939
గిర్వి, ఫల్తాన్, మహారాష్ట్ర , భారతదేశం
మరణం 2014 డిసెంబర్ 15
ముంబై
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీ సమితి చైర్మన్‌గా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పని చేసి 1980 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఫల్తాన్ శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 1985 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా,[2] ఆ తరువాత 1990 శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్ 1985లో ఏడాదిపాటు ఉపాధి హామీ పథకానికి చైర్మన్‌గా పని చేశాడు.

సూర్యాజీరావు శంకర్‌రావు కదమ్ వృధ్యాప సమస్యల కారణంగా 75 ఏళ్ళ వయస్సు అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2014 డిసెంబర్ 15న మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election Results 1980". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "सूर्याजीराव कदम यांच्यावर अंत्यसंस्कार". Loksatta. 15 December 2014. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.