స్వరాజ్యలక్ష్మి

స్వరాజ్యలక్ష్మి ప్రముఖ రంగస్థల, సినిమా నటి. ఈమె తాడంకి శేషమాంబ కుమార్తె.[1] ఈమె తెనాలిలో 1930 ఆగస్టు 15 న జన్మించింది.తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిింది.

బాల్యం మార్చు

స్వరాజ్యలక్ష్మి తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు, నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె పల్లెటూరి పిల్ల (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత పెద్ద మనుషులు (1954), దొంగరాముడు, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), చంద్రహారం మొదలైన సినిమాలలో నటించింది.

తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త సి.ఆర్.మోహన్ తో కలిసి కళారంగంలో కృషిచేసింది.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.

మూలాలు మార్చు

  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.

వెలుపలి లంకెలు మార్చు