ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరిజిల్లా కోనసీమలో 1996 నవంబర్ నెలలో అతి పెద్ద తుఫాను.కోనసీమ చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి చెట్లు నేలకొరిగాయి[1][2]1996లో పెనుతుపాను సమయములో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు.

1996 కోనసీమ తుఫాను
తుఫాను
తుఫాను ఉపగ్రహ ఛాయాచిత్రం
చలనంతుపాను స్థితి
ఏర్పడిన తేదీ1996 నవంబరు 4
సమసిపోయిన తేదీ1996 నవంబరు 7
మరణాలు1077
నష్టం$602 million (1996 USD)
ప్రభావిత ప్రాంతాలుతూర్పుగోదావరి జిల్లా, కోనసీమ,అమలాపురం
ఆంధ్ర ప్రదేశ్ , కాకినాడ సమీపించే తుఫాను యొక్క ఉపగ్రహ చిత్ర పటం

తుఫాన్ కదలిక మార్చు

అక్టోబర్ చివరిలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, అండమాన్ నికోబర్ దీవుల మీదుగా పయనం సాగించి తుఫానుగా మరి బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. 5 నవంబర్ 1996 తుఫాను తీవ్రత పెరిగీ హరికేన్ మారి నవంబర్ 6 న ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ యానం మధ్య తీరం తాకింది. తీరం తాకే సమయంలో 215 కిలోమీటర్ల గాలులు వేగంతో గోదావరి జిల్లాల వైపు ఉగ్రరూపం చూపించింది.

తుఫాను తీవ్రత మార్చు

తుఫాను ప్రభావం ఎక్కువగా కోనసీమ లో అమలాపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. తుఫాను ముందు సుమారు 225,000 కుటుంబాలు అధికారులు ఖాళీ చేయించారు. చాలా పట్టణాల్లో సరైన తుఫాను ఆశ్రయాలు లేవు. మొత్తం నష్టంలో 70% తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. కాకినాడ సమీపంలోని రెండు గ్రామాలు భైరవపద బులుసుతిప్ప పూర్తిగా ధ్వంసమయ్యాయి.గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు అందలేకపోవడంతో అక్కడ 90% పడవలు దెబ్బతిన్నాయి.మత్యకరులు చాలా మంది మరణించారు.చనిపోయిన వారిలో చాలామంది సముద్రంలో కొట్టుకుపోయారు.అమలాపురంలో భారీ వర్షపాతం 390 మిమీ నమోదైనది.[3][4]ఈ తుఫాన్ కారణంగా 1,077 మంది మరణించారు. ఈ తుఫాను 241,802 హెక్టార్లు (597,510 ఎకరాలు) పంటలను నాశనం అయ్యాయి.2 లక్షల 33 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.దాదాపు 2,27000 హెక్టార్ల చేతికొచ్చిన ఖరీఫ్ వరి పంట పోయింది.40 వేలకు పైనా ఇల్లులు నేలమట్టం అయిపోయాయి.78 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు రాజమహేంద్రవరం లో మినీ సెక్రెటేరియట్ ఏర్పాటు చేశారు.[5][6][7]

అధికార సహాయక చర్యలు మార్చు

తుఫాను భారీ నష్టం తరువాత, నిరాశ్రయులైన వారికి తాత్కాలిక శిబిరాల్లో ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం 1772 మందికి 742 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.పాఠశాలలు, కార్యాలయ భవనాలను ఉపయోగించుకుంది. తుఫాను తగ్గిన తరువాత నిరాశ్రయులైన చాలా మంది ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కార్మికులు నీటి సేవను పునరుద్ధరించారు. అవసరమైన వారికి త్రాగునీటిని పంపిణీ చేశారు. హైవేల నుండి చెట్లను తొలగించడానికి కార్మికులు క్రేన్లను ఉపయోగించారు.విద్యుత్ సరఫరా వలె రోడ్లు కమ్యూనికేషన్ లింకులు త్వరగా పునరుద్ధరించబడ్డాయి బాధిత పౌరులకు 75 కిలోల బియ్యం వంటి సహాయక వస్తువులను అందించారు. రెడ్‌క్రాస్ దుప్పట్లు, ఆహారం, వంట సామాగ్రిని తీసుకెళ్లే 10 ట్రక్కులను ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. అయినప్పటికీ నివాసితులు పేద ప్రాంతాలలో సహాయం కోసం పోరాడారు. హెలికాప్టర్లు తుఫాను నష్టాన్ని కూడా పరిశీలించాయి, ఎందుకంటే చాలా చిన్న గ్రామాలు రోడ్ల ద్వారా అనుసంధానించబడలేదు. తుఫాను తరువాత సుమారు 935 వైద్య బృందాలు స్థాపించబడ్డాయి, నీటిని శుద్ధి చేయడానికి క్లోరినేటెడ్ తాగుడు మాత్రలు పంపిణీ చేయబడ్డాయి. తుఫాను తరువాత విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సుమారు 500,000 US డాలర్లు విరాళంగా ఇచ్చాయి.ప్రపంచ బ్యాంక్ ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను నుండి కోలుకోవడానికి 30 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేశారు.ప్రభుత్వం తుఫాను సమయంలో గుడిసెలు కూలిపోయిన ప్రతి కుటుంబానికి 1,500 , రూ. తుఫానుతో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 100,000 చెల్లించారు.[8]

ప్రభావితమైన మండలాలు మార్చు

తుఫాన్ ప్రభావం ఎక్కువగా కోనసీమ లోనే ఉంది. అమలాపురం,ఉప్పలగుప్తం,కాట్రేనికోన,అయినవిల్లి ,ముమ్మడివరం,కొత్తపేట వంటి ప్రాంతాలలో ఎక్కువ నష్టం వాటిల్లింది.

నష్టం మార్చు

1996 తుపాను స‌మ‌యంలో సమాచార, రవాణా వ్యవస్థలు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో అపార‌ న‌ష్టం సంభవించింద‌న్నారు.సుమారు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు విరుచుకుపడటంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి చెట్లు నేలకొరిగాయి. గోడలు కూలిపోయాయి. కిటికీల అద్దాలు వాటంతట అవే పగిలిపోయాయి.విద్యుత్ సరఫరాకు, మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.చాలామంది ప్రజలు చీకట్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని పునరావాస కేంద్రాల్లోకి పరుగులు తీశారు.ముఖ్యంగా కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి చెందిన కోనసీమ ఆ తుపాను కారణంగా భారీ నష్టాన్ని కలిగించింది. కోనసీమ ప్రాంతానికి చాలారోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లక్షలాది కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. సుమారు 2,25,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో పశువులు, పక్షులు చనిపోయాయి. 2,41,802 హెక్టార్లలో చేతికి అందివచ్చిన ఖరీఫ్‌ వరి పంట దెబ్బ తినగా 6,47, 554 ఇళ్లు నేల మట్టం అయినట్టు ప్రభుత్వం అంచనా వేశారు.తుపాను అనంతరం కోనసీమ ఎడారిగా మారిపోయింది. తినడానికి తిండి కూడా లేక ప్రజలు అల్లాడిపోయారు. అప్పటి ప్రభుత్వం, రెడ్‌క్రాస్‌, ప్రపంచ బ్యాంకు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవడంతో 10-15 ఏళ్ల తర్వాత కోనసీమ కోలుకోగలిగింది. ఆ తర్వాత చాలా తుపానులు వచ్చినప్పటికీ 1996 స్థాయిలో నష్టాన్ని కలిగించలేదు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. RSMC New Delhi. Regional Specialised Meteorological Centre (RSMC) – Tropical Cyclones, New Delhi (PDF) (Report). India Meteorological Department. Archived from the original (PDF) on 12 April 2012. Retrieved 24 April 2015.
  2. "India: Cyclone IFRC situation report no. 2 – India". ReliefWeb (in ఇంగ్లీష్). 21 November 1996. Retrieved 2019-11-15.
  3. India Cyclone Information Report No.2. United Nations Department of Humanitarian Affairs (Report). ReliefWeb. 15 November 1996. Retrieved 6 November 2015.
  4. "India Cyclone Death Toll May Exceed 2,000". ReliefWeb. Reuters. 11 November 1996. Retrieved 7 November 2015.
  5. "Tragedy revealed as water recedes". The News. Associated Press. 10 November 1996. Retrieved 10 November 2015.
  6. India: Cyclone IFRC situation report no. 2. International Federation of Red Cross and Red Crescent Societies (Report). ReliefWeb. 21 November 1996. Retrieved 6 November 2015.
  7. "Historical Exchange Rates". Oanda Corporation. 2015. Retrieved 6 November 2015.
  8. "Agence France Presse (AFP)". Lexikon des gesamten Buchwesens Online. doi:10.1163/9789004337862_lgbo_com_010242. Retrieved 2019-11-15.

బయటి లింకులు మార్చు