అంబటి లక్ష్మి నరసింహరాజు
అంబటి లక్ష్మి నరసింహారాజు తెలుగు కవి, రచయిత.[1]
జీవిత విశేషాలు మార్చు
అంబటి లక్ష్మీనరసింహరాజు వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో 1892లో జన్మించాడు. తండ్రి సుందరరాజు. అతను ఎన్నో నాటకాలు కావ్యాలు శతకాలు రచించాడు. అతని రచనలపై వసుచరిత్ర రచించిన రామరామభుషణుని(భట్టుమూర్తి) ప్రభావం చాలా ఉంది.
కర్ణుడు అధినాయకుడిగా చేసి ' కర్ణాభ్యుదయము ' కావ్యం రచించాడు.లాగి సెట్టి పేటవాసులు పూస్కూరు రంగారావు ప్రోత్సాహం మీద అర్జునుని అధి నాయకునిగా ' విజయ విజయం ' కావ్యాన్ని రచించాడు.చాలా శతకాలు అలభ్యాలు.
ప్రబంధాలు మార్చు
- ప్రచ్ఛన్న పాండవము
- ప్రహ్లాద చరిత్ర
- ప్రభావతి ప్రద్యుమ్నo.
- యదువీర విజయం
- హానుమద్విజయం
- విజయ విజయం
- కర్ణాభ్యుదయం
నిర్వచన మహాకావ్యాలు: మార్చు
- సుమతి
- శశిరేఖ
- ద్రౌపతి
- రుక్మాంగద
- పార్వతి పరిణయం.
నవలలు మార్చు
- శాంతాబాయి[2]
శతకాలు: మార్చు
- శ్రీ వెంకటేశ్వర శతకం
- యాదగిరి నృకేసరి శతకం
- నిరోష్ట్య శతకం
- సాంబమూర్తి
మూలాలు మార్చు
- ↑ తెలుగు సాహితీ కిన్నెర, తెలుగు (2018). డిగ్రీ ద్వితీయ సంవత్సరం తెలుగు పుస్తకం. హిమాయత్ నగర్: తెలుగు అకాడమీ. pp. Page. ISBN 8181803329.
- ↑ telugu, NT News (2022-02-06). "నవలా ప్రభంజనం.. తెలంగాణ సాహిత్య ప్రస్థానం". www.ntnews.com. Retrieved 2023-09-12.