అమియా ఠాగూర్

బెంగాలీ రవీంద్ర సంగీత గాయని

అమియా ఠాగూర్ ((12 ఫిబ్రవరి 1908 - 13 నవంబర్ 1986) బెంగాలీ రవీంద్ర సంగీత గాయని. రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి నేరుగా నేర్చుకున్న అతికొద్ది మంది గాయకులలో ఆమె ఒకరు[1]. స్వరకర్త స్వయంగా దర్శకత్వం వహించిన ఠాగూర్ నృత్య నాటకం మాయర్ ఖేలాలో ఆమె ప్రమద పాత్రను పోషించింది. తరువాత ఆమె ఠాగూర్ అన్నయ్య మనవడిని వివాహం చేసుకోవడం ద్వారా ఠాగూర్ కుటుంబంలో సభ్యురాలిగా మారింది.

ప్రారంభ జీవితం మార్చు

సురేంద్రనాథ్ రాయ్, బారిస్టర్ కుమార్తె అయిన ఆమె 1908 ఫిబ్రవరి 12 న కలకత్తాలో జన్మించింది, బెథూన్ పాఠశాల, బెథూన్ కళాశాలలో విద్యనభ్యసించింది. ఆమె ఒక ముస్లిం ఉస్తాద్ వద్ద సంగీతంలో ప్రారంభ శిక్షణ పొందింది, తరువాత నాగేంద్ర కిషోర్ బందోపాధ్యాయ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. ఆమె రవీంద్ర సంగీతాన్ని నేరుగా కవి వద్దే నేర్చుకుంది. ఆమెకు ఎంత మెలోడియస్ వాయిస్ ఉందంటే కవి ఆమెకు అత్యంత క్లిష్టమైన బాణీలు నేర్పించేవాడు. ఈమె హృంద్రనాథ్ ఠాగూర్ ను వివాహం చేసుకుంది.[2]

తరువాతి జీవితం మార్చు

అమియా ఠాగూర్ తన పెళ్లి తర్వాత ఠాగూర్ పుట్టినరోజున మాత్రమే పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఆమె కాంచన్జుంగా (1962) చిత్రంలో సత్యజిత్ రే కోసం 'ఎ పారాబేస్ రబే కే హే' పాడింది. తన జీవిత చరమాంకంలో, 1979 లో, కలకత్తాలోని రవీంద్ర సదన్ లో తన పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శాంతినికేతన్ లో విశ్వ సంగీత గురువు శైలజరంజన్ మజుందార్ తన జ్ఞాపకాలలో ఇలా వ్రాశాడు, ఒకసారి కలకత్తాకు వెళ్లి అమియా ఠాగూర్ నుండి మోరీ లో మోరీ అమే అమే దేకేచే కే పాటను నేర్చుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. [3]

మూలాలు మార్చు

  1. Ghosh, p. 109
  2. "তবু মনে রেখো … বিস্মৃতির অতলে অমিয়া ঠাকুর : স্বর্ণাভা কাঁড়ার" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-07.
  3. Bose, Anjali (editor), 2004, Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol 2, (in Bengali), p 22, ISBN 81-86806-98-9 (set) and ISBN 81-86806-99-7 (Vol 2).