అశోక్ ధామ్ మందిర్

బీహార్ లోని శివాలయం

అశోక్‌ధామ్ మందిర్‌ను ఇంద్రదమ్నేశ్వర్ మహాదేవ్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో అశోక్ ధామ్ రాజౌన చౌక్ లో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఇంద్రదమ్నేశ్వర్ మహాదేవ్ మందిర్‌ను కలిగి ఉన్న ఆలయ సముదాయం, ఈ సముదాయంలో పార్వతి, నంది, దుర్గాదేవిలకు అంకితం చేయబడిన మరో మూడు దేవాలయాలు కూడా ఉన్నాయి.

అశోక్‌ధామ్ మందిర్, లఖిసరాయ్
లఖిసరాయ్ వద్ద అశోక్‌ధామ్ ఆలయ దృశ్యం.
లఖిసరాయ్ వద్ద అశోక్‌ధామ్ ఆలయ దృశ్యం.
అశోక్ ధామ్ మందిర్ is located in India
అశోక్ ధామ్ మందిర్
Location within India
భౌగోళికం
భౌగోళికాంశాలు25°11′35.7″N 86°04′23.9″E / 25.193250°N 86.073306°E / 25.193250; 86.073306
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాలఖిసరాయ్
ప్రదేశంబల్గూడర్ గ్రామం
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహా శివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహిందూ ఆర్కిటెక్చర్
దేవాలయాల సంఖ్య4
చరిత్ర, నిర్వహణ
స్థాపితం12వ శతాబ్దం
సృష్టికర్తఇంద్రద్యుమ్న రాజు
దేవస్థాన కమిటీశ్రీ ఇంద్రదమ్నేశ్వర్ మహాదేవ్ ట్రస్ట్

చరిత్ర మార్చు

8వ శతాబ్దం నుండి ఈ ప్రదేశం పూజా కేంద్రంగా ఉందని చెప్పబడింది. పాల సామ్రాజ్యం 6వ చక్రవర్తి నారాయణ్ పాల్ 8వ శతాబ్దంలో శివలింగం సాధారణ పూజలను ప్రారంభించాడు. 12వ శతాబ్దంలో ఇంద్రద్యుమ్న రాజు ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం కూల్చివేయబడి చాలా సంవత్సరాలుగా భూమిపై అవశేషాలు లేవని చెబుతారు.

7 ఏప్రిల్ 1977న, అశోక్, గజానంద్ అనే ఇద్దరు వ్యక్తులు సాంప్రదాయ గిల్లీ-దండ ఆట ఆడుతున్నప్పుడు నేల కింద ఉన్న శివలింగాన్ని కనుగొన్నారు. 1993 ఫిబ్రవరి 11న జగన్నాథపురి శంకరాచార్య ఆలయ సముదాయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుత ఆలయ సముదాయ భవనం 15 నవంబర్ 2002న శ్రీ ఇంద్రదమ్నేశ్వర్ మహాదేవ్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.[1][2]

మహా శివరాత్రి మార్చు

ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. దేవతకి గంగానది పవిత్ర జలాన్ని సమర్పిస్తారు. ఇక్కడ బస చేయడానికి ధర్మశాల (గెస్ట్‌హౌస్) నిర్మించబడింది, ఇక్కడ సుదూర ప్రయాణం చేసి వచ్చిన యాత్రికులు బస చేస్తారు.

చిత్రాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Ashokdham Temple - Lakhisarai".
  2. "Shivlingam unearthed by Ashok".