ఏక్తా మంచ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కూటమి

ఏక్తా మంచ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కూటమి. 2014 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ లో ఈ కూటమిని ప్రకటించారు. ఆ సమయంలో అది సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, క్వామీ ఏక్తా దళ్, జన్వాది పార్టీ, జన్ అధికార్ మంచ్ లను కలిగి ఉంది.[1] సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించాడు.[2]

మూలాలు మార్చు

  1. Khyati, Surbhi (14 April 2013). "Kushwaha to contest LS polls from Ghazipur". Indian Express. Retrieved 13 May 2019.
  2. India Today. In UP, Akhilesh leads the way with AAP effect