ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడింది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు.[1]

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Great Living Chola Temples
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఐరావతేశ్వర దేవాలయ దృశ్యం
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంi, ii, iii, iv
మూలం250
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
భౌగోళికాంశాలు10°56′54″N 79°21′24″E / 10.94841°N 79.356708°E / 10.94841; 79.356708
శిలాశాసన చరిత్ర
శాసనాలు1987 (11వ సమావేశం)
పొడిగింపులు2004

పురాణగాథ మార్చు

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది.[2] ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .

పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.

దేవతలు మార్చు

ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియ నాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉంది. బయటి భాగంలో ప్రాకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దెవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది.[3]

నిర్మాణ శైలి మార్చు

ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులోఅనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వరాలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తుంది.

ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున ఉంది.[4] ఈ వేవాలయ విమానం (టవర్) 24 మీ (80 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం లోని గర్భగుడి అక్ష మంటపాలతో, పరివృత్త మార్గంతో గాని కూడుకొని లేదు.[1] దాని దక్షిణం వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు, గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది.[5] ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి.[1] అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" ఉంది. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది. [3][6]

నైరుతి మూలలో గల మంటపంలో నాలుగు విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతోపాటు అతి పెద్ద రాళ్లపై "సప్తమాతలు" యొక్క శిల్పాలు చెక్కబడినవి.[3] విడిగా నిర్మించబడిన దేవీ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడింది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది.[1]

దేవాలయంలోని శాసనాలు మార్చు

ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో "కుళుత్తుంగ చోళుడు (రెండవ)" దేవాలయాన్ని పురరుద్దరించినట్లు తెలుస్తోంది.[7]

వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం, వివరాలు ఉన్నాయి. వారి జీవితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నాయి. [7][8][9] హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.[10] ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి, నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి.[4]

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం మార్చు

ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004 లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం లోని చండైకొండ చోళీశ్వరాలయం, దారసురంలోని ఐరావతేశ్వరాలయాలు ప్రసిద్ధమైఅంవి. ఈ దేవాలయానన్నీ 10వ, 12 వ శతాబ్దముల మధ్య చోళుల కాలంనాటివి. మీ మూడు దేవాలయాలకొ అనేక పోలికలున్నాయి.[11]

చిత్రమాలిక మార్చు

ప్రపంచ వారసత్వ ప్రదేశం మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Great Living Chola Temples - UNESCO World Heritage Centre
  2. See P.V. Jagadisa Ayyar, pp 350-351
  3. 3.0 3.1 3.2 See P.V. Jagadisa Ayyar, p 351
  4. 4.0 4.1 http://www.thehindu.com/todays-paper/tp-features/tp-editorialfeatures/darasuram-architectural-marvel-from-chola-period/article2260784.ece
  5. See Chaitanya, K, p 42
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-23. Retrieved 2015-02-17.
  7. 7.0 7.1 See P.V. Jagadisa Ayyar, p 353
  8. See Chaitanya, K, p 40
  9. See Geeta Vasudevan, p 55
  10. http://whc.unesco.org/en/list/250/
  11. See P.V.Jagadisa Ayyar, p 316

సూచికలు మార్చు

  • Geeta Vasudevan (2003). The Royal Temple of Rajaraja: An Instrument of Imperial Chola Power. Abhinav Publications. ISBN 81-7017-383-3.
  • P.V. Jagadisa Ayyar (1993). South Indian Shrines. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0151-3.
  • Krishna Chaitanya (1987). Arts of India. Abhinav Publications.
  • Richard Davis (1997). Lives of Indian images. Princeton, N.J: Princeton University Press. ISBN 0-691-00520-6.

ఇతర లింకులు మార్చు

  Media related to ఐరావతేశ్వర దేవాలయం at Wikimedia Commons