కడియాల వెంకటేశ్వరరావు

ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు.

కడియాల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు. ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు.

కడియాల వెంకటేశ్వరరావు
కడియాల వెంకటేశ్వరరావు
జననంకడియాల వెంకటేశ్వరరావు
తెనాలి దగ్గర్లోని కఠెవరం
నివాస ప్రాంతంతెనాలి దగ్గర్లోని కఠెవరం
వృత్తిఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌
ప్రసిద్ధిపురావస్తు పరిశోధకుడు

జీవిత విశేషాలు మార్చు

అతని స్వస్థలం తెనాలి దగ్గర్లోని కఠెవరం. పోల్‌వాల్ట్‌ జాతీయ చాంపియన్‌, మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మూడుసార్లు ప్రపంచ పోటీల్లో పాల్గొన్నాడు. 2001లో హైజంప్‌లో నాలుగో స్థానం (బ్రిస్టన్‌), 2006లో (ఆస్ట్రియా) హైజంప్‌లో ఐదో స్థానాన్ని పొందిన ఏకైక రాష్ట్ర వెటరన్‌ అథ్లెట్‌.

పరిశోధనలు మార్చు

శ్రీకాకుళం జిల్లా పాండవుల మెట్ట పై అతి పెద్ద 'మెగాలిత్‌ డాల్మిన్‌' ను కనుగొన్నాడు. జైనులు వినియోగించిన అతి పురాతన రాతి పడకలను ఈ కొండలపై ఉన్న గుహల్లో ఉండటాన్ని వెలుగులోకి తెచ్చాడు. శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండలం దన్నానపేట, పాండవులమెట్ట వద్ద క్రీస్తు పూర్వం 1000-500 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన బృహత్మలాయుగపు అతిపెద్ద సమాధి బయల్పడింది. దీనిని రాష్ట్ర క్రీడా సంస్థ మాజీ అధికారి గా ఉన్న అతను చేపట్టిన అణ్వేషణలో ఈ సమాధి వెలుగులోకొచ్చింది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దది.

తెనాలి దగ్గర్లోని మల్లెపాడు లో బౌద్ధస్థూపం ఉందని రుజువు చేశాడు. కఠెవరానికి చెందిన కనకదండి సోమన్న , సర్‌ ఆర్థర్‌ కాటన్‌కన్నా ముందే కృష్ణానదిలో ఆనకట్ట నిర్మించారని వెల్లడించాడు. కారంపూడి దగ్గర్లోని రాక్షసబండ నిలువురాతిశిల సా.శ.1000-500 శతాబ్దాల మధ్య లోహయుగపు నాటిదిగా ఆధారసహితంగా పేర్కొన్నాడు.

గుంటూరు జిల్లా దాచేపల్లి దగ్గరలోని కేశనపల్లి వద్ద నాగులేరు ఒడ్డున రాతిపై చెక్కిన ఆదిమ కాలంనాటి చిత్రాలను కనుగొన్నాడు. [1]

మూలాలు మార్చు

  1. "Pre-historic rock art site unearthed in Guntur". Archived from the original on 2018-04-18. Retrieved 2018-07-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు మార్చు