కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ

విద్యాసంస్థ

కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీచే నడుపబడుతున్న భారత ప్రభుత్వ ప్రాజెక్టు. 2017 జూలైలో స్థాపించబడిన ఈ సంస్థకు భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె అబ్దుల్ కలాం గౌరవార్థం ఆతని పేరు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ క్యాంపస్‌లో విశాఖపట్నంలో ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వ కార్యక్రమం కింద ఈ సంస్థ స్థాపించబడింది.[1]

కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ
ఆంగ్లంలో నినాదం
విజ్ఞానేన జాతాని జీవంతి
రకంప్రజా
స్థాపితం2017
అనుబంధ సంస్థబయోటెక్నాలజీ విభాగం
డైరక్టరుప్రొఫెసర్ కె. విజయరాఘవన్
స్థానంవిశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
17°37′47″N 83°09′46″E / 17.629777°N 83.162910°E / 17.629777; 83.162910

సంస్థ మార్చు

కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి, వైద్య సాంకేతికత ఎగుమతులపై దృష్టి సారించింది. ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతోంది.[2]

పరిశోధనలు మార్చు

ఈ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ కోసం వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి సమాచారాన్ని అందిస్తుంది. ది జోవన్నా బ్రిగ్స్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ కోసం పరిశోధనతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది.[3]

మూలాలు మార్చు

  1. "government program". the hindu. 2018-12-03. Retrieved 2018-12-06.
  2. "introduction". the hans india. 2018-11-16. Retrieved 2018-12-09.
  3. "ties up with". the hindu. 2018-06-18. Retrieved 2018-12-11.