కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం

కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వర్ జిల్లాలో ఉంది. ఈ జిల్లా పేరు నుంచే ఈ ఉద్యనవనాన్నికి కిష్ట్వర్ అని నామకరణం చేశారు.

కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
సమీప నగరంకిష్ట్వర్, జమ్మూ కాశ్మీర్
విస్తీర్ణం400 చ. కి.మీ.
స్థాపితంఫిబ్రవరి4, 1981

చరిత్ర మార్చు

ఈ ఉద్యానవనాన్ని ఫిబ్రవరి 4, 1981 న జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 400 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. దీని పరీవాహక ప్రాంతంలో కాశ్మీరీలు, ఠాకూర్లు, గుజార్లు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు నివసిస్తుంటారు.[1]

మరిన్ని విశేషాలు మార్చు

ఈ ఉద్యానవనం ఉత్తరాన రిన్నే నది, దక్షిణాన కిబార్ నాలా, తూర్పున గ్రేట్ హిమాలయాలు, పశ్చిమాన మార్వా నది ఉన్నాయి. ఈ ఉద్యానవన భూభాగం కఠినమైన, నిటారుగా ఇరుకైన లోయలతో ఉంటుంది. ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాల సెంట్రల్ స్ఫటికాకార బెల్ట్‌లో ఉంది. ఈ ఉద్యానవనం కియార్ నాథ్, కిబార్ నాలాస్ పరీవాహక ప్రాంతాలలో ఉంది. ఇవన్నీ నైరుతి దిశలో ఉన్న మార్వా నదిలోకి ప్రవహిస్తాయి. ఇవ్వన్నీ కలిసి చినాబ్ నదిలో కలుస్తాయి. ఈ ఉద్యానవనంలో మంచు ప్రాంతాల్లో నివసించే హిమాలయ స్నోకాక్, బ్రౌన్ ఎలుగుబంట్లు వంటి ఎన్నో రకాల జంతువులు సంరక్షించబడుతున్నాయి.

మూలాలు మార్చు

  1. కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం. "Kishtwar National Park". natureconservation.in. Archived from the original on 29 సెప్టెంబరు 2019. Retrieved 29 September 2019.