కీర్తి కిరీటాలు యద్దనపూడి సులోచనారాణి రాసిన నవల.[1] ఇది అత్యద్భుత నవలగా పాఠకుల ప్రశంసలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల.

కీర్తికిరీటాలు
కీర్తికిరీటాలు నవలా ముఖచిత్రం
కృతికర్త: యద్దనపూడి సులోచనారాణి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: క్వాలిటీ పబ్లిషర్స్
విడుదల:
ముద్రణ: శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్,వినుకొండ

కథాక్రమం మార్చు

కళలైన సంగీతం, నాట్యాలను నేపథ్యంగా వాడుతూ, వాటికి కుటుంబ కథను జోడించి రచించిన అందమైన నవల. కొటిమందిలో - ఏ ఒక్కరికో, ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం రాజ్యలక్ష్మికి లభిస్తుంది. ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కీరీటాలు పెట్టింది. అయితే ఆమె అదృష్టం అలా మెరిసి ఇలా మాయమయింది .ఒక సంగీత కళాకారిణి జీవితంలోని అపస్వరాలని ఆర్ధంగా చిత్రించే నవల కీర్తి కీరీటాలు. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది.[2]

మూలాలు మార్చు

  1. "@inksudha Instagram profile with posts and stories - Picuki.com". www.picuki.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-23.
  2. "Keerti Keeritaalu - కీర్తి కిరీటాలు by Yaddanapudi Sulochana Rani - Keerti Keeritaalu". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-14. Retrieved 2020-04-23.