కొమ్మినేనివారి పాలెం
కొమ్మినెని వారి పాలెం , బాపట్ల జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం..
గ్రామం | |
Coordinates: 15°56′56″N 79°59′24″E / 15.949°N 79.99°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | బల్లికురవ మండలం |
Area | |
• మొత్తం | 5 km2 (2 sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( 08404 ) |
పిన్కోడ్ | 523260 |
గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు
చరిత్రలో ఒకనాటి పెదజంగాలపల్లి అనే గ్రామమే ఈనాటి కొమ్మినేనివారిపాలెం.
గ్రామ భౌగోళికం మార్చు
సమీప మండలాలు మార్చు
తూర్పున మార్టూరు మండలం, ఉత్తరాన సంతమాగులూరు మండలం, తూర్పున యద్దనపూడి మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు
ఈ గ్రామ పాఠశాలకు శుద్ధజలం అందజేయడానికి ప్రవాసాంధ్రుడు ఎం.సురేష్ బాబు ముందుకు వచ్చారు. సేవాధృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టుచున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గ్రామంలో మౌలిక వసతులు మార్చు
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు
నాగార్జునసాగర్ డామ్ నుండి వచ్చు నీటి ద్వారా సస్యశ్యామలంగా విరాజిల్లుతున్నది.
గ్రామ పంచాయతీ మార్చు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు
శివాలయం మార్చు
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం మార్చు
నూతనంగా నిర్మించుచున్న ఈ ఆలయం, ఊరికి ప్రసిద్ధి. గ్రామ ప్రజల, ఇతరుల స్వచ్ఛంద విరాళాల సహాయంతో దీనిని నిర్మించుచున్నారు. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం స్వామివారిని గ్రామంలోని ప్రధాన వీధులలో ఎడ్లబండిపై ఊరేగించెదరు. అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతి ఇంటిముందు ఆపినప్పుడు, గ్రామ మహిళలు హారతులిస్తారు. గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు.
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవాలు, 2017, జూన్-11వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ఒక మండలం రోజులపాటు హరేరామనామ సంకీర్తనం చెసినారు. ఉదయం దేవాలయంలోని స్వామివారికి కళ్యాణమహోత్సవం, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం మార్చు
ఈ ఆలయ 18వ వార్షికోత్సవం, 2015, మే నెల-17వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు
గ్రామస్తుల, దాతల 20 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016, ఫిబ్రవరి-20వ తేదీ మాఘశుద్ధత్రయోదశినాడు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిమించారు. విగ్రహం ప్రక్కనే నవగ్రహాలను గూడా ఏర్పాటుచేసారు.
గ్రామంలో ప్రధాన పంటలు మార్చు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు మార్చు
గ్రామ విశేషాలు మార్చు
ఈ గ్రామంలో పని చేయు వివేకానంద ట్రస్ట్ అదే గ్రామంలోని ఉద్యొగులచే స్థాపింపబడి, గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, పిల్లలలో, పెద్దలలో సేవాభావాలను పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.