గడ్డెన్న వాగు నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి 2 కి.మీ. దూరంలో సుద్దవాగుపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు. సుద్దవాగు, గోదావరి నదిలో కలిసే ఉపనదం. నిర్మల్ జిల్లా లోని లోకేశ్వరం, భైంసా, ముధోల్ మండలాల్లోని 20 గ్రామాల్లో 14 వేల ఎకరాల్లో సాగునీరుతోపాటు భైంసా నగర పంచాయతీలో తాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు నిర్మించారు.[2][3]

గడ్డెన్న వాగు
అధికార నామంగడ్డెన్న వాగు
దేశంభారత దేశం
ప్రదేశంభైంసా
ఆవశ్యకతసాగు నీరు
స్థితిపని చేస్తోంది
నిర్మాణం ప్రారంభం2000
ప్రారంభ తేదీ2006
నిర్మాణ వ్యయం20.33 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్రం
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుసుద్దవాగు
Elevation at crest350.7 మీ.[1]
జలాశయం
పరీవాహక ప్రాంతం21.834 చ.కి.మీ
సాధారణ ఎత్తు358.7 మీ.


20.33 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలై, 2006 లో పూర్తైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు.[4]

మూలాలు మార్చు

  1. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  3. గడ్డెన్న వాగు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  4. "కడెం ప్రాజెక్టు వరద గేటు ఎత్తివేత". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-09. Retrieved 2020-05-11.