గుడివాడ పురపాలక సంఘం

గుడివాడ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం లోని, గుడివాడ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

గుడివాడ పురపాలక సంఘం
గుడివాడ
స్థాపన1937
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
గుడివాడ
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

గుడివాడ పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 45 కి.మీ దూరంలో ఉంది.గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది.1937 లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 6 మండలాలు, 36 ఎన్నికల వార్డులు ఉన్నాయి.దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 118,167 జనాభా ఉండగా అందులో పురుషులు 59,062, మహిళలు 59,105 మంది ఉన్నారు.అక్షరాస్యత 81.64% ఉండగా అందులో పురుష జనాభాలో 85.54%, స్త్రీ జనాభాలో 77.75% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10509 ఉన్నారు.గుడివాడ మునిసిపాలిటీలో 30,834 గృహాలు పైగా ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ‌ శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు.[2] వైస్ చైర్మన్‌గా అడపా వెంకట రమణ పనిచేస్తున్నాడు.[2]

మూలాలు మార్చు

  1. "Gudivada Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-20.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు