చీకట్లో సూర్యుడు

చీకట్లో సూర్యుడు అను నవల యండమూరి వీరేంద్రనాథ్ చే రచింపబడినది. ఈ నవల మొదట ఉదయం (పత్రిక) వారపత్రిక లో వచింది. ఇది యండమూరి వ్రాసిన మొదటి సైన్స్‌ ఫిక్షన్ నవల. భవిష్యత్తులో గ్రహాంతర వాసులతో వచ్చే ఘర్షణ ఈ నవలకు ప్రేరణ. కొంతమంది గ్రహాంతర వాసులు సూర్యుణ్ణి తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాలను శాస్త్రజ్ఞుడైన కథానాయకుడు ఎలా ఆపగలిగాడన్నది ముఖ్య కథాంశం.

కథ మార్చు

భూమికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గెలాక్సీలోని ఒక గ్రహం వారు తమ ఇంధన కొరతను తీర్చడానికి సరైన నక్షత్రం కోసం వేటాడుతుంటారు. వారికి మన విశ్వంలో ఉన్న సూర్యుడు తారసపడతాడు. దాన్ని వాళ్ళ అద్భుత సాంకేతిక పటిమతో సరాసరి గ్రహానికి చేరువగా తీసుకెళ్ళాలనుకుంటారు. ఈ పరిస్థితిని ఊహించి భూమ్మీద నుంచి కొంతమంది శాస్త్రవేత్తలను రాయబారం పంపుతారు. వారి వ్యోమ నౌక కాంతి వేగంతో ప్రయాణించి సుదూరంలో ఉన్న గ్రహాన్ని చేరుకుని కార్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి కాంతివేగం కంటే ఎక్కువ వేగంతో తిరిగి భూమిని చేరుతుంది. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఓ ప్రేమకథ అంతర్లీనంగా సాగుతుంటుంది.