చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది హైదరాబాదు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్సభ ఎన్నికల్లో గడ్డం రంజిత్రెడ్డి గెలుపొందాడు.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు
2009 ఎన్నికలు మార్చు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బద్దం బాల్రెడ్డి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో మిర్యాలగూడ లోక్సభ నుండి విజయం సాధించిన ఎస్.జైపాల్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2][3]
సంవత్సరం రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు 2009 జనరల్ సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ 4,20,807 ఎ.పి.జితేందర్ రెడ్డి టీడీపీ 402275 2014 జనరల్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ 435077 పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ 362054 2019 జనరల్ జి.రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ 528148 కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 513831 2024 జనరల్
2024 ఎన్నికలు మార్చు
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి 64 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఏప్రిల్ 26వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 46మంది అభ్యర్థులు నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమయానికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు.[4][5]
మూలాలు మార్చు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ Eenadu (13 April 2024). "పట్టు నిలపాలని.. పాగా వేయాలని." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ EENADU (30 April 2024). "4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ Andhrajyothy (30 April 2024). "ముగిసిన నామినేషన్ల ఘట్టం". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.