జాతీయ వృద్ధుల దినోత్సవం

జాతీయ వృద్ధుల దినోత్సవం (నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 21న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. వృద్ధులకు మద్దతునిస్తూ వృద్ధుల శ్రేయస్సు,సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించి అభినందించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు[1].

జాతీయ వృద్ధుల దినోత్సవం
జరుపుకొనేవారుదేశవ్యాప్తంగా
ప్రారంభంఆగస్టు 21
ఆవృత్తివార్షికం
వృద్ధుల అశ్రమంలో వృద్ధులు ఉన్న దృశ్యచిత్రం

ప్రారంభం మార్చు

1988, ఆగస్టు 19న అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రకటనపై సంతకం చేశారు, ఆగస్టు 21ను జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించాడు. దాని ఆధారంగా, వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.[2]భారతదేశంలో ప్రస్తుతం 15 కోట్లమందికి పైగా వృద్ధులున్నారు.

కార్యక్రమాలు మార్చు

  1. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
  2. వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వృద్ధులకు సత్కారాలు, సన్మానాలు చేస్తారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "World Senior Citizen's Day 2021: Date, History And Celebration". NDTV.com. Retrieved 2023-08-24.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 August 2019). "ఆ వయసులో ఆదరించాలి". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.

బయటి లింకులు మార్చు