డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం కొండపి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 4 డిసెంబర్ 1971
తూర్పు నాయుడుపాలెం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు డోలా కోటయ్య

జననం, విద్యాభాస్యం మార్చు

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి 4 డిసెంబర్ 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెంలో జన్మించాడు. ఆయన విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర రావు పై 5440 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్యపై 1,024 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  4. TV9 Telugu (23 May 2019). "ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)