తయ్యబా బేగం బిల్‌గ్రామీ

తయ్యబా బేగం బిల్‌గ్రామీ హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు.[1] అంజుమన్-ఏ-ఖవాతీన్ అనే జాతీయ మహిళా సంస్థను స్థాపించి ముస్లిం మహిళల అభ్యుదయానికి కృషిచేసింది.[2] ఈమె తండ్రి హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ. ఈమె ప్రసిద్ధ వైద్యుడు ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్) ను పెళ్ళిచేసుకుంది.

మూలాలు మార్చు

  1. "Tyaba Begum Sahaba Bilgrami". HelloHyderabad.com. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 3 November 2014.
  2. Ray, Bharati (Sep 15, 2005). Women of India: Colonial and Post-colonial Periods. SAGE Publications India. p. 569. ISBN 8132102649.