మహేశ్వరం లో గల కోదండ రామస్వామి దేవాలయం వెనుక అక్కన్న మాదన్నల కచేరి కేంద్రం ఉంటుంది .నాలుగొందల సంవత్సరాల క్రితం క్రీ.శ 1658 నుంచి 1687 వరకు గోల్కొండను పాలించిన అబూహసన్ తానీషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుగాడేవాళ్లు. విడిది కోసం తరుచూ మహేశ్వరానికి వచ్చేవారు. భద్రాచలం నిర్మాణానికి ముఖ్యపాత్ర వహించిన అక్కన్న, మాదన్నలు, కంచర్ల గోపన్నలతో మహేశ్వరం ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నది. అక్కన్న మాదన్నల తండ్రి భానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హన్మకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి.
ఆయన అక్కన్నపల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే మూడు గ్రామాలను నిర్మించాడు. ఈ రోజు అవి అకాన్పల్లి, మన్సాన్పల్లి, సుభాన్పల్లిగా వాడుకలో ఉన్నాయి. అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారు. అందులో ఒకటి మాంఖాల్ మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం.
ఈ గడిలో రాముడు లేని గుడి.ఒక మూలన అమ్మవారి చిన్న గుడి మరియు ఆ పక్కనే గడిలో అలనాటి మసీదు.. ఇంకోపక్క గడిలో ఒక పాఠశాల ఉంటుంది.
అక్కన్న మాదన్న ఘడికోటలో మైసమ్మ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు.భక్తులు సాయంత్రం సామూహిక ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పిస్తారు.. ఊరేగింపులో గంగపుత్రుల జాలమందిళ్ళుల పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూన కాలు, బ్యాండు మేళాలు, డప్పుల దరువులు,ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రయాణ మార్గం:
హైదరాబాదుకి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహేశ్వరం గడీకిి బస్సు మార్గం మరియు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.హైదరాబాద్
లోని చార్మినార్,
కోఠి,ఇబ్రహీంపట్నం,చాంద్రాయణగుట్ట ,రాజేంద్రనగర్ నుండి మహేశ్వరానికి ఆర్టీసీ సదుపాయం ఉంది.
Ancient Gadikota Fort
Maheshwaram, Telangana 501359
ఈ కృతితో సంబంధమున్న వ్యక్తి తనకు ప్రపంచవ్యాప్తంగా కాపీహక్కుల చట్టం క్రింద ఈ కృతిపై ఉన్న అన్ని హక్కులని మరియు ఈ కృతిలో తనకి ఉన్న సంబంధిత న్యాయపరమైన హక్కులని, చట్టం అనుమతించిన మేరకు, వదులుకుని ఈ కృతిని కామన్స్కి అంకితమిచ్చారు. CC0 క్రింద ఉన్న కృతులకు ఆపాందింపు అవసరం లేదు. కృతిని ఉటంకించేప్పుడు, కృతికర్త యొక్క ఆమోదాన్ని మీరు అంతర్నిహితంగా సూచించకూడదు.
http://creativecommons.org/publicdomain/zero/1.0/deed.enCC0Creative Commons Zero, Public Domain Dedicationfalsefalse
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.