దివి శివరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కందుకూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

దివి శివరాం
దివి శివరాం


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2004
ముందు మానుగుంట మహీధర్ రెడ్డి
తరువాత మానుగుంట మహీధర్ రెడ్డి
నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1951
కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు దివికొండయ్య చౌదరి

జననం, విద్యాభాస్యం మార్చు

దివి శివరాం 1951లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం లో జన్మించాడు. ఆయన 1984లో ఎం.ఆర్. మెడికల్ కాలేజీ, గుల్బర్గ్ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్ (జనరల్) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

దివి శివరాం తన తండ్రి దివికొండయ్య చౌదరి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా కందుకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కందుకూరు నియోజకవర్గం లోని 92 గ్రామాలకు లింక్ రోడ్లు, స్టీట్ లైట్లు, కందుకూరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, సోమశిల నీరు డాక్టర్ దివి శివరాం కృషి వల్ల సాధ్యమయినవి.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1994 దివి శివరాం టీడీపీ 52376 మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 46351
1999 దివి శివరాం టీడీపీ 63964 మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 62439
2004 మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 67207 దివి శివరాం టీడీపీ 59328
2009 మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 74553 దివి శివరాం టీడీపీ 70310
2014 పోతుల రామారావు వైసీపీ 84538 దివి శివరాం టీడీపీ 80732

మూలాలు మార్చు

  1. Sakshi (24 March 2019). "కందుకూరు చూపు.. మానుగుంట వైపు..." Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  2. Andhrajyothy (7 August 2021). "కష్టకాలంలో ఐక్యంగా ఉందాం: దివి శివరాం". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.