ద్వారబంధాల చంద్రయ్య


ద్వారబంధాల చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటీషువారిపై పోరాటం ఇతను బ్రిటీషువారికి వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీసినాడు.[1] [2] తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టారు. ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య అంబుల్ రెడ్డి న్యాయకత్వంలో సామ్రాజ్యవాదుల దోపిడీ-ప్రజల ప్రతిఘటనలో భాగంగా మన్యం రైతులు, మురాదార్లు అధికార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాయి లేవదీశారు. రంపచోడవరంలో ప్రారంభమయిన పితూరీ భద్రాచలం, రేకపల్లి, గోలుగొండ- ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో భాగంగా ద్వారబంధాల చంద్రయ్య 1879 ఏప్రిల్ అడ్డతీగెల పోలీసు స్టేషనును ధ్వంసం చేశాడు, అదే సంవత్సరం చంద్రయ్య అనుచరులను 79 మందిని ప్రభుత్వం కాల్చివేసింది. 1880 ఫిబ్రవరిలో చంద్రయ్యను కూడా పోలీసులు కాల్చివేశారు.[3].

మూలాలు మార్చు

  1. "kapunews: తిరగబడ్డ తెలగబిడ్డ - మన్యం పులి - శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు". kapunews. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  2. M.sharma (1987). Role Of Revolutionaries In The Freedom Struggle.
  3. https://ia801900.us.archive.org/33/items/in.ernet.dli.2015.491430/2015.491430.aandhrula-sanqs-ipta.pdf