పాతిపెట్టిన నాణెములు

పాతిపెట్టిన నాణెములు నవలను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. పాతిపెట్టిన నాణెములు నవల విశ్వనాథ సత్యనారాయణ రాసిన కాశ్మీర రాజవంశ నవలలు అనే నవలా మాలికలో భాగం.

'పాతిపెట్టిన నాణెములు'
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
సీరీస్: కాశ్మీర రాజవంశ నవలలు
ప్రక్రియ: నవల
ప్రచురణ:
విడుదల: 1966
పేజీలు: 173
దీనికి ముందు: యశోవతి
దీని తరువాత: మిహిరకులుడు

రచన నేపథ్యం మార్చు

నవల రచనా కాలం 1966. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ నవలను ఆశువుగా చెప్తుండగా ఆయన శిష్యుడైన గరికపాటి సత్యనారాయణ లిపిబద్ధం చేశారని రచయిత కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. [1] 1966లో తొలిముద్రణ పొందిన ఈ నవల 2006కు మొత్తం మూడు ముద్రణలు పొందింది.

కాశ్మీర రాజవంశ నవలలు మార్చు

కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలిక. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది[2].
పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:

  1. యశోవతి
  2. పాతిపెట్టిన నాణెములు
  3. మిహిరకులుడు
  4. సంజీవకరణి
  5. కవలలు
  6. భ్రమరవాసిని

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. కవలలు నవల ప్రతిలో ఒకమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి ఇచిన సమాచారం.
  2. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.