పాదయాత్ర

సమాజంలోని వేర్వేరు భాగాలతో మరింత సన్నిహితంగా వ్యవహరించడానికి ఒక రాజకీయ నాయకులు లేదా ప్రముఖ ప

కాలినడకన చేసే ప్రయాణాన్ని పాదయాత్ర అంటారు. ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు వారిని మరింత సన్నిహితంగా సంప్రదించుటకు, వారి మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు, ప్రముఖులు పాదయాత్ర చేపట్టుతారు. హిందూ మతంలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు కొందరు భక్తులు పాదయాత్ర ద్వారా చేరుకుంటారు. [1]

ఉప్పు సత్యాగ్రహ పాదయాత్రలో గాంధీజీ

సామాజిక కారణాలు మార్చు

1930లో దండి వరకు జరిగిన ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్రతో మహాత్మా గాంధీ పాదయాత్ర ప్రారంభమయింది. 1933-34 శీతాకాలంలో, మహాత్మా గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు.[2] తరువాత 1951 లో భూదాన ఉద్యమంలో భాగంగా గాంధేయవాది వినోభాభావే కూడా తన పాదయాత్రను ప్రారంభించారు. భావే ప్రారంభించిన పాదయాత్ర తెలంగాణా ప్రాంతం నుండి ప్రారంభమై బుద్ధగయ వరకు కొనసాగింది.[3] 1983 జనవరి 6 న చంద్రశేఖర్ సింగ్ కన్యాకుమారి నుండి తన పాదయాత్ర ప్రారంభించారు, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ 1983 జూన్ 25 వరకు ఢిల్లీలో రాజ్ ఘాట్ దాకా తన 4260 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించారు.[4]

మూలాలు మార్చు

  1. "History of Padyatra". Archived from the original on 2012-07-23. Retrieved 2014-07-14.
  2. Ramachandra Guha (Nov 8, 2005). "Where Gandhi Meets Ambedkar". The Times of India. Archived from the original on 2012-07-11. Retrieved 2014-07-14.
  3. David R. Syiemlieh (2005). Reflections From Shillong: Speeches Of M.M. Jacob. Daya Books. p. 135. ISBN 8189233297.
  4. Manisha (2010). Profiles of Indian Prime Ministers. Mittal Publications. pp. xxi. ISBN 8170999766.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పాదయాత్ర&oldid=3879116" నుండి వెలికితీశారు