పురానపూల్ కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఇదీ ఒకటి. అంతేకాదు హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

పురానపూల్
Coordinates17°22′03″N 78°27′30″E / 17.36755°N 78.458278°E / 17.36755; 78.458278
OS grid reference[1]
Carriesపాదచారులు
Crossesమూసీ నది
Localeహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
Characteristics
Total length600 ft
Width35 ft
History
Inaugurated1578 CE
Location
పటం
1880లలో పురానాపూల్ దాటుతున్న ప్రజలు

నిర్మాణ కాలం మార్చు

ఈ వంతెన సా.శ.1578లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వన్ వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జీని నిర్మించారు. మరో కథనం ప్రకారంగా సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా భార్య భాగమతితో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెను క్రమం తప్పకుండా కలవడానికి పురానపూల్ నిర్మించాడు. ఆ తరువాత వివాహం చేసుకున్నాడు.

విశేషాలు మార్చు

ఈ పూల్ నిర్మాణంలో 22 అర్చ్ లు ఉన్నాయి. ఎత్తు 54 అడుగులు, పొడవు 600 ఫీట్లు, వెడల్పు35 చదరపు అడుగులు.

యాత్రికులు మార్చు

ఈ కట్టడాన్ని ఎంతోమంది విదేశీయాత్రికులు సందర్శించారు. అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్ సందర్శించిన ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ పురానాపూల్ నిర్మాణ శైలికి ముగ్ధుడైనాడు. దీన్ని పారిస్ లోని పోంట్ న్యుఫ్ తో పోల్చాడు.

పునర్ నిర్మాణం మార్చు

400 ఏళ్లనాటి ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1820లో కొద్దిగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మతులు చేయిపించాడు. ఆ తర్వాత 1908లో మూసి నది వరదల తర్వాత దెబ్బతిన్న కొద్దిబాగాన్ని మరమ్మతు చేశారు.

ఇతర వివరాలు మార్చు

దీనికి సమీపంలో మియా మిష్క్ మసీదు ఉంది.

మూలాలు మార్చు

  1. చరిత్ర-ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, తెలుగు అకాడమి హైదరాబాద్ ముద్రణ, 2016, పేజీ నెం. 70.