ప్రవీణ మెహతా

భారత వాస్తుశిల్పి, ప్లానర్ మరియు రాజకీయ ఉద్యమవాది

ప్రవీణ మెహతా (1923-1992 లేదా 1925-1988) భారాతదేశానికి చెందిన ఆర్కిటెక్ట్, ప్లానర్ ఇంకా రాజకీయ కార్యకర్త . భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, సరోజిని నాయుడు నుండి ప్రేరణ పొందిన ఈమె తాను చదువుకునే రోజుల్లో బ్రిటీష్ రాజ్‌కి వ్యతిరేకంగా వీధి నిరసనలలో పాల్గొంది. [1] [2] ఈమె 1964 లో చార్లెస్ కొరియా, శిరీష్ పటేల్ ల సహకారంతో నయా ముంబై ప్రణాళిక, భావన, ప్రతిపాదనలో పాలుపంచుకుంది, ఈ ప్రాజెక్టులో భాగంగా ముంబై ప్రధాన భూభాగంలో తూర్పున ఉన్న ద్వీపం వరకు నగరాన్ని విస్తరించడం జరిగింది. [1]

ప్రవీణ మెహతా
జననం1923 or 1925
మరణం1992 or 1988
జాతీయతభారతీయురాలు
వృత్తిఅర్చిటెక్ట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నవీ ముంబై నిర్మాణకర్త
ప్రవీణ మెహతా మరో ఇద్దరు ఆర్కిటెక్ట్‌లతో కలిసి చేపట్టిన నవీ ముంబై అర్బన్ ప్లానింగ్ చిత్రం

తొలినాళ్లలో మార్చు

మెహతా 1940 లలో సర్ జెజె కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసింది. భారత స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆసక్తితో తన చదువును మధ్యలోనే ఆపివేసి, ఆ తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి తన ఆర్కిటెక్చర్ విద్యను పునః ప్రారంభించింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆమె జైలు శిక్ష కూడా అనుభవించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చదువుకుంది, ఈ కళాశాల నుండి ఆమె ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆ తరువాత ఆమె చికాగో విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. చదువు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలు వాషింగ్టన్ డిసి లో ఆర్కిటెక్టు వృత్తి చేపట్టి, 1956లో భారత్ కు తిరిగి వచ్చింది.[3]

వృత్తి జీవితం మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Woods, Mary N. "The Legacies of Architect Pravina Mehta for Feminism and Indian Modernity". Cornell University. Archived from the original on 22 నవంబర్ 2022. Retrieved 16 September 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Basu, Sudipta (1 June 2008). "Building Blocks". Mumbai Mirror. Retrieved 16 September 2015.
  3. Basu, Sudipta (1 June 2008). "Building Blocks". Mumbai Mirror. Retrieved 16 September 2015.