ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్

భారత పౌరులు కానివారు భారతదేశం లోని కొన్ని ప్రాంతాలను (ప్రధానంగా ఈశాన్య భారతదేశంలో) సందర్శించాలంటే అవసరమయ్యే అనుమతి పత్రాన్ని రక్షిత ప్రాంత అనుమతి (PAP) పత్రం అంటారు. [1] ఫారినర్స్ (ప్రొటెక్టెడ్ ఏరియాస్) ఆర్డర్, 1958 ప్రకారం ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కనీసం ఇద్దరు ఉన్న బృందానికి మాత్రమే PAP ని మంజూరు చేస్తారు. ఈ ప్రాంతాల్లో నివసించని భారతీయ పౌరులు ఈ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన పత్రాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అంటారు. ఇన్నర్ లైన్ పర్మిట్ పొందడం PAP పొందడం కంటే చాలా సులభం.

అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించడానికి అనుమతించే దేశీయ ఇమ్మిగ్రేషన్ స్టాంపు

అలాగే ఫారినర్స్ (రెస్ట్రిక్టెడ్ ఏరియాస్) ఆర్డర్, 1963 అనే మరొక ఉత్తర్వు ప్రకారం, భారత పౌరులు కానివారు భారతదేశం లోని కొన్ని ప్రవేశ-నియంత్రిత ప్రాంతాలను సందర్శించాలంటే నియంత్రిత ప్రాంత అనుమతి (RAP) పత్రం అవసరం. 2009 నాటికి, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులను, సిక్కిం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనూ సందర్శించాలంటే ఈ RAP అవసరం. PAP లాగా కాకుండా RAP ని ఒక్కొక్క ప్రయాణీకునికి కూడా మంజూరు చేస్తారు. దీన్ని విదేశీ రాయబార కార్యాలయాల ద్వారా పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో పోర్ట్ బ్లెయిర్ లోని వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం లో అక్కడికక్కడే జారీ చేస్తారు కూడా. ప్రవేశ నియంత్రిత ప్రాంతాలను సందర్శించడానికి భారతీయ పౌరులకు ప్రత్యేక అనుమతి అవసరం లేదు.

రక్షిత, నియంత్రిత ప్రాంతాల జాబితా మార్చు

రక్షిత ప్రాంతాలు మార్చు

ప్రవేశ నియంత్రిత ప్రాంతాలు మార్చు

మాజీ రక్షిత లేదా నియంత్రిత ప్రాంతాలు మార్చు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన 2010 డిసెంబరు 30 నాటి సర్క్యులర్ ప్రకారం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల లోని మొత్తం ప్రాంతం విదేశీయుల (రక్షిత ప్రాంతాలు) ఆర్డర్ 1958 కింద నోటిఫై చేయబడిన రక్షిత ప్రాంతం నుండి మినహాయించబడింది. కొన్ని షరతులకు లోబడి 2011 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే ఒక సంవత్సరం కాలం పాటు ఈ మినహాయింపు ఇచ్చారు. MHA ID నోట్ No.13/6/99-NE II Vol. V తేదీ 23 మార్చి 2012 ద్వారా ఈ మినహాయింపును 2012 డిసెంబర్ 31 వరకు పొడిగించారు.

సాధారణ రక్షిత ప్రాంతం అనుమతి అవసరాలు మార్చు

  • పర్యాటకులు కనీసం ఇద్దరుండే సమూహాలుగా ప్రయాణించాలి
  • వారు రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్‌తో ప్రయాణించాలి
  • కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రవేశ/నిష్క్రమణ స్థానాల వద్ద మాత్రమే అనుమతిస్తారు. కొన్ని ప్రాంతాలలో భారతీయులు కానివారికి ప్రవేశం లేదు.
  • పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ పౌరులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదంతో మాత్రమే PAPని పొందవచ్చు

సాధారణంగా PAPకి 10 రోజుల వ్యవధి ఉంటుంది, మరో 7 రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది. PAPని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. అయితే, సంబంధిత భారతీయ రాష్ట్రాలకు చెందిన వివిధ అధికారులు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు కూడా కూడా PAPని జారీ చేయవచ్చు. సాధారణంగా టూరిస్టుల కోసం ట్రావెల్ ఏజెంట్లు PAPని పొందే ఏర్పాటు చేస్తారు.

సమస్యలు మార్చు

ప్రస్తుతానికి సంరక్షించబడిన ప్రాంతంలో భారతీయులు కానివారికి పర్యాటక సందర్శన కోసం మాత్రమే ఆమోదిస్తారు. అయితే, ఈ ప్రాంతాలను సందర్శించేందుకు ఇతర చట్టబద్ధమైన కారణాలను కూడా అనుమతిస్తారు. ఉదాహరణకు ఈ ప్రాంతానికి చెందిన స్థానిక వ్యక్తిని వివాహం చేసుకున్న వ్యక్తి తన అత్తమామలను సందర్శించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజలు, భారతీయేతేరులను పెళ్ళి చేసుకుంటే, లేదా వారి పిల్లలు వేరే దేశ పౌరులైతే, వారి భారతీయేతర కుటుంబ సభ్యులు శాశ్వత నివాస అనుమతి పొందడం సాధ్యం కాదు కాబట్టి, వారు తమ కుటుంబంతో కలిసి ఈ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడలేరు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Foreigners (Protected Area Order) (1958)" (PDF). Aasc.nic.in. Retrieved 2015-07-15.[permanent dead link]
  2. Cook, Sharell (23 October 2016). "Information About Permits for North East India". TripSavvy. Retrieved 14 June 2017.