బిశ్వంభర్ పరిదా

భారతీయ పత్రిక రాజకీయనేత మరియు స్వాతంత్ర సమరయోధుడు

బిశ్వంభర్ పరిదా (1921 ఫిబ్రవరి 8 – 1999 నవంబర్ 25) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. అతను ఒడిషా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో జన్మించాడు. అతను చాలా చిన్న వయస్సులోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. దాదాపు రెండు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అతను బెర్హంపూర్ జైలులో ఉన్నప్పుడు, తన సహచరులు, తోటి స్వాతంత్ర్య సమరయోధులలో కలిసి అనేక సామాజిక, సాహిత్య, సంస్థాగత కార్యకలాపాలలో పాల్గొన్నాడు. [1]

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిదా, 40 సంవత్సరాలకు పైగా ఒడిశాలోని ప్రముఖ ప్రాంతీయ వార్తాపత్రికలైన ది సమాజ, ప్రజంత్రాలో పనిచేసి, పత్రికా రంగానికే అంకితమయ్యాడు. పని చేస్తున్నప్పుడు ప్రజంత్రాలో పనిచేస్తూండగా ఆయన ఒడీశా మాజీ ముఖ్యమంత్రి, మాజీ - మహారాష్ట్ర గవర్నరు అయిన హరేకృష్ణ మెహతాబ్ కు అత్యంత సన్నిహితుడయ్యాడు. అతని మరణం వరకు, హరేక్రుష్ణ మహతాబ్ స్థాపించిన ప్రజాత్రా ప్రచార సమితి కి చెందిన ఐదు శాశ్వత ట్రస్ట్ బోర్డు సభ్యులలో పరిదా ఒకడు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రులు బిజు పట్నాయక్, జానకి బల్లభ్ పట్నాయక్‌తో కూడా ఆయనకు సన్నిహిత పరిచయం ఉంది.

అతను సాహిత్య వర్గాలలో కూడా చురుకుగా ఉండేవాడు. అతని చిన్న కవితల సంకలనం, శతాబ్దిరా ద్యాని (శతాబ్దపు గొంతు) ఒరియా సాహిత్య రంగంలో విస్తృతంగా ప్రశంసించబడింది.

అతను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి స్వాతంత్ర్య సమరయోధుల సంస్థలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. 15 సంవత్సరాలకు పైగా ఒడిశా స్వాతంత్ర్య సమరయోధుల సమితి అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆల్ ఇండియా ఫ్రీడం ఫైటర్స్ సమితికి ఉపాధ్యక్షుడయ్యాడు.

జీవితంలోని చివరి దశలలో, పరిదా కటక్, భువనేశ్వర్ నగరాలు జగత్సింగ్‌పూర్ జిల్లాలోని అనేక సామాజిక సాంస్కృతిక సంస్థలలో చురుకుగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖమైన సామాజిక వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను 1999 నవంబరు 25 న కటక్‌లో మరణించాడు. ఆయనకు మరణానంతరం ఉత్కళ జ్యోతి ప్రదానం చేశారు.

మూలాలు మార్చు

  1. "Biswambhar Parida". Archived from the original on 2021-01-31. Retrieved 2021-01-25.