మక్కెన మల్లిఖార్జున రావు

మక్కెన మల్లిఖార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వినుకొండ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మక్కెన మల్లిఖార్జున రావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు వీరపనేని యల్లమందరావు
తరువాత జీ.వి. ఆంజనేయులు
నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చిన్నరామయ్య
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

మక్కెన మల్లిఖార్జున రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి వీరపనేని యల్లమందరావు చేతిలో ఓడిపోయి, 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల లీలావతిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

ఆయన 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (24 March 2019). "విజ్ఞుల మాట..వినుకొండ". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.