యెగిషె చారెంట్స్ మెమోరియల్ మ్యూజియం

యెగిషె చారెంట్స్ మెమోరియల్ మ్యూజియం (యెగిషె చారెంట్స్ లోని హౌస్ మ్యూజియం (యెగిషె చారెంట్స్ "టున్-టి"అంగరన్)) యెగిషె చారెంట్స్ నివాసంలో ఉన్నది. అక్కడ అతను 1935 నుండి 1937 వరకు నివసించారు.

యెగిషె చారెంట్స్ మెమోరియల్ మ్యూజియం

చరిత్ర మార్చు

ఆర్మేనియా కౌన్సిల్ మంత్రులు చారెంట్స్ 1935-1937 వరకు నివసించిన ప్రదేశాన్ని ఫిబ్రవరీ 8,1964 న మెమోరియల్ మ్యూజియంగా మార్చారు. న్వార్డ్ బాగ్దసర్యన్ ను ఈ మ్యూజియంకు డైరెక్టరుగా నియమించారు. కవి యొక్క కుమార్తెలు అర్పెనిక్, అనహిట్ ఈ మ్యూజియం స్థాపనకు మద్దతుగా నిలిచారు. 10 జనవరి 1975న మ్యూజియంను ప్రజలకు తెరిచారు.[1]

1987లో చారెంట్స్ పంతొమ్మిదవ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా కరెన్ డెమిర్చియన్ సహకారంతో ఆ ఫ్లాట్ లో అనేక మార్పులు చేశారు, మ్యూజియం విస్తరించి ఉన్న ప్రాంతాన్ని 626.3 m2 ప్రాంతంగా మార్చారు.

మ్యూజియంలోని ప్రధాన ప్రదర్శన మూడు మందిరాలను ఆక్రమించింది ఉంటుంది.

  • హాల్ ఎ −1897-1918
  • హాల్ బి – 1918-1927
  • హాల్ సి – 1928-1937

కలెక్షన్స్ మార్చు

 
యెగిషె చారెంట్స్ వ్యక్తిగత లైబ్రరీ
 
యెగిషె చారెంట్స్ గ్రామ్ఫోను

యెగిషె చారెంట్స్ మెమోరియల్ మ్యూజియాన్ని అతని జీవితాన్ని, తన సాహిత్య, సాంస్కృతిక, సామాజిక-రాజకీయ కార్యకలాపాలాను చదవడానికి ఒక రీసెర్చు సెంటరు .[2]

కవి శేషాలను (తన వ్యక్తిగత వస్తువులు, మాన్యుస్క్రిప్ట్స్, పత్రాలు, పుస్తకాలు, ఫొటోలు, ఇతర నమూనాలను, చారెంట్స్ ఆధారాన్ని భరించేందుకు మద్దతుగా ఉన్నవి, అతని గొప్ప టాలెంట్ ఏమిటంటే కవిత్వం రాయడం మాత్రమే కాకుండా వాటిని అనువాదించి ప్రచురించడం) ఉన్నాయి. మ్యూజియం లో ప్రదర్శించిన.

మ్యూజియంలో అత్యంత విలువైన వస్తువు మెమోరియల్ హౌస్ లో ఉన్నది, అక్కడ ప్రతీది చార్నెట్ జీవితకాల వ్యవధిగా ఉన్నవి.

ఈ హౌస్ ను చాలా సొంపుగా అమర్చారు – పశ్చిమ, తూర్పు అభిరుచులకు ఇది ఒక సున్నితమైన కలయిక : గ్రాండ్ పియానో "బెకర్", టైపురైటర్ యంత్రము, ఎరుపు చెక్క ఫర్నిచర్, తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన తివాచీలు, ఒట్టోమన్, చైనీస్ ప్యానెల్లు, బుద్ధని యొక్క ఐవరీ, కాంస్య విగ్రహాల సేకరణ, లియోనార్డో డా వించి, ఫ్రా ఆంగెలికో మొదలైనవారి పునరుత్పత్తి విగ్రహాలు ఉన్నాయి.

చారెంట్స్ వ్యక్తిగత లైబ్రరీ మెమోరియల్ హౌస్ లో ఒక భాగం . ఆర్పెనిక్ ప్రకారం 1930వ సంవత్సరం చివరిలో చారెంట్స్ లైబ్రరీలో  దాదాపుగా 6000 పుస్తకాలు ఉన్నాయి, తర్వాత కవులను అరెస్టు చేసిన తరువాత, పెద్ద సంఖ్యలో పుస్తకాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు లైబ్రరీలో 1452 పుస్తకాలు ఉన్నాయి వాటిలో అనేక విలువైన పుస్తకాలు వివిధ భాషలలో వివిధ ప్రొఫెషనల్ విషయాలను తెలుపుతున్నాయి అనగా, కళలు, మతాలు. చారెంట్స్ వద్ద  ఒక ఆర్మేనియన్ రచయితలకు చెందిన ఒక విన్నూత్నమైన పుస్తకాల సేకరణ ఉన్నది, వారిలో: కోరెనాట్సి, భుజాండ్, నరెకాట్సి, కుచాక్, స్నోర్హాలి, సయత్-నోవ, లియో, తుమన్యన్, తెరియాన్, ఇసహక్యాన్, మెట్సారెంట్స్ ఉన్నారు. ప్రాచీన గ్రీక్, యూరోపియన్, రష్యన్ పురాతనమైన కళ, సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన అతను అందుకు సంబంధించిన  అరిలుయిస్, ప్రౌస్ట్, అస్వగూష, పిరండెల్లో, స్పెంగ్లర్, ఠాగూర్, ఇతరులు పుస్తకాలను సేకరించారు. ఈ మధ్య పుస్తకాలలో 1907-1916 వరకు ముధ్రించిన రష్యన్ పత్రికకు చెందిన "స్టేరీ గోడి"కు చెందిన 25 వాల్యూములు ఎంతో ముఖ్యమైనవి. లైబ్రరీలోని అనేక పుస్తకాలు సంతకంతో ఉన్నాయి.లో లాభాలను చారెంట్స్ తీసుకున్న గమనికలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర రచయితలు రాసినవి అనగా – అవేటిక్ ఇసహాక్యాన్, హామ్లిక్ తౌమానియన్, గరేగిన్ బెస్, ఖచిక్ దష్టెంట్స్, ఇతరులు రచించినవి ఉన్నాయి. అనేక పుస్తకాలను టిఫ్లింస్, మాస్కో, పీటర్స్బర్గ్, సారిట్సిన్ నుండి కొనుగోలు చేశారు.

ఈ మ్యూజియంలో ప్రదర్శనలు, సాహిత్య-సంగీత సమావేశాలు, ఉపన్యాసాలు, కచేరీలు, సమావేశాలు, ప్రెజెంటేషన్లు, రోజువారి కవిత్వం చదవడం వంటి కార్యాలు చేస్తారు.

సూచనలు మార్చు

  1. Yeghishe Charents Memorial Museum, Yerevan, "Pera Print", 2008, p. 104, ISBN 978-99941-874-0-9
  2. Charents 115. Yerevan: "Astghik Publishing House". 2012. p. 120. ISBN 978-9939-840-07-9.