వాడుకరి:Babavali virat/ప్రయోగశాల

ఎనిమిదేళ్ళ వయసులో తనకు చేతనైన రీతిలో పొడుగు పొట్టి పాదాలతో పద్యాలు రాయటం చూసి వారి నాన్నగారు తనకి సులక్షణ సారం అనే లక్షణ గ్రంధాన్ని కొని ఛంధస్సులో మెలకువలు నేర్పించారు. ఆరోతరగతి చదువుతున్న రోజుల్లో వీరనరసింహ విజయసింహులు" అనే నవల రశాడు. తర్వాత "గోకులాయి" అనే డిటెక్టివ్ నవల "సావిత్రీసత్యవంతము" అనే పద్యనాటకము రచించారు. ఇవి అచ్చుకాలేదు రాతప్రతులు కూడ లేవు. అప్పటికి ఆమె వయస్సు 9 ఏళ్ళు అదే సంవత్సరం శ్రీశ్రీ పరిణయ రహస్యము అనే నవలిక రాసి ప్రచురించాడు. శ్రీశ్రీ రచనల్లో మొదట అచ్చైనది ఇదే.

            సుప్రసిద్ధ కవి సెట్టి లక్ష్మినరసింహంగారు శ్రీశ్రీ నాన్నగారికి ప్రాణస్నేహితుడు . ఆయనతో కలసి శ్రీశ్రీ అద్యతనాంధ్రకవి ప్రపంచ నిర్మాతలు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారిని దర్శించారు శ్రీశ్రీ రచించిన తొలి ఖండకావ్యం "దివ్యలోచనలు" పురిపండా అప్పలస్వామి ప్రోత్సాహంతో "స్వశక్తి" పత్రికలో ప్రచురితమైనది. పురిపండాతో  స్నేహం శ్రీశ్రీకి కవిత్వ రచనల్లో ప్రయోజనకారి అయ్యింది. పురిపండా,వడ్డాదిసీతరామంజనేయులు, శ్రీశ్రీ కలసి విశాఖపట్టణంలో "కవితా సమితిని స్థాపించారు.
            చదవటం ప్రారంభించినప్పటి నుండి ఏ పుస్తకం దొరికినా దాన్ని పూర్తి చేసేదాకా శ్రీశ్రీకి ఏమి తోచేది కాదు. కేరమ్స్ , ఫుట్ బాల్ , ఆటలంటే ఇష్టం. చిన్నప్పుడు "ఆంధ్ర కంఠీవ కోడి రామమూర్తి ఛాతి మీద ఏనుగు పోయిన దృశ్యాన్ని చూసి ఆనందించాడు. చిన్నపటి నుండి సముద్రమంటే ఇష్టంతో "నా కవిత్వాని సముద్రమే ఆవేశమ్" అని అన్నాడు . శ్రీశ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ప్రభవ{1928} నేఅ పద్య కావ్యం రచించాడు. ప్రభవలోని ఖండ కావ్యాల మీద కృష్ణశాస్త్రి, విశ్వానాధ వారల కవిత్వ ప్రభావం గాఢంగా ఉన్నది. శ్రీశ్రీ  అప్పుడప్పుడు విజయనగం వెళ్ళి కోణంకి అప్పలస్వామి,చాగంటి సోమయాజులు,శ్రీరంగం నారయణబాబు గారలతో సాహిత్య విషయాలు చర్చించి తన ఊహలకు పదును పెట్టుకునే వాడు. సోదరుడు నారయణతో శ్రీశ్రీ కి భావసారూప్యం ఉంది.   శ్రీశ్రీ BA