వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 40వ వారం

విష్ణువును పూజిస్తున్న జయదేవుడు

జయదేవుడు

జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. ఈయన 12 వ శతాబ్దమునకు చెందినవాడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. జయదేవుడు ఒరిస్సా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్న కెందుళి(బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కెందుళి సాసన్ ( ఇప్పుడిలా పిలువబడుతోది ) గ్రామం, పూరీకి సమీపంలో ఉంటుంది. ఈ విషయమును జయదేవుడు 7 వ అష్టపదిలో "కిందుబిల్వ సముద్ర సంభవ" అని పేర్కొనిరి. జయదేవుడి తలిదండ్రులు, భోజదేవుడు మరియు రమాదేవి లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒరిస్సా చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటక లో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడాడు.ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. బీద బ్రాహ్మడుడాఇన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినారని తెలియుచున్నది.బెంగాలులోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని అస్థానమున క్రీ.శ 1116 లో జయదేవుడు ఒక పండితుడిగానున్నట్లు అచట గల ఆధారములను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై "గోవర్థనుడు, పారణ, జయఃదేవులు" అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కబడియున్నవి.

(ఇంకా…)