బాలాంత్రపు రజనీకాంతరావు
బాలాంత్రపు రజనీకాంతరావు వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన అవర్ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం తర్వాత, రజనీకాంతరావు రచించి స్వరపరిచిన మాదీ స్వతంత్రదేశం అనే గీతాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది. అతడు రచించి స్వరపరిచిన "కొండ నుండి కడలి దాకా" రూపకానికి జపాన్ వారి "నిప్పాన్ హోసో క్యొకాయ్" బహుమతి లభించింది. ఆకాశవాణిలో ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమాన్ని ప్రారంభించింది రజనీయే. తన సంగీతంలో లిరిసిజానికి కారణం రజనీ ప్రభావమేనని మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్నాడు.
(ఇంకా…)