వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 45వ వారం

భావరాజు వేంకట కృష్ణారావు
భావరాజు వేంకట కృష్ణారావు ప్రఖ్యాత చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు, రచయిత, న్యాయవాది. వెంకటకృష్ణారావు ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలికి వ్యవస్థాపక కార్యదర్శి. ఈ సంఘం వెలువరించిన పత్రికకు అనే సంవత్సరాల పాటు సంపాదకత్వం వహించాడు. తూర్పు చాళుక్య చక్రవర్తి అయిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకపు 900వ సంవత్సరీకపు ఉత్సవాలను నిర్వహించాడు. ఈ సందర్భంగా వెలువడించిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సంచికకు సంపాదకత్వం వహించాడు. 1922లో రాజమహేంద్రవరంలో ఇతర ప్రముఖ చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు, డా.చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మలతో కలిసి ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలిని స్థాపించాడు. ఆయన చారిత్రిక పరిశోధన ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానిస్తూ డా.వి.వి.కృష్ణశాస్త్రి, "ఆంధ్రదేశ చరిత్ర వ్రాయబూనిన ప్రతివారు మూలస్తంభాల వంటి భావరాజువారి గ్రంథాలను పఠించకపోతే ఆ రచనలు అసంపూర్ణంగానే పరిగణింపబడతాయి" అని అన్నాడు.


(ఇంకా…)