విశ్వనాథ పావని శాస్త్రి

విశ్వనాథ పావని శాస్త్రి తెలుగు రచయిత.

జీవిత విశేషాలు మార్చు

విశ్వనాథ పావని శాస్త్రి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కుమారుడు. పావని శాస్త్రి తన తండ్రి అంత కవి,రచయిత కాకపోయినా స్వంతంగా కొన్ని కథలు వ్రాశాడు. తన తండ్రి వ్రాసిన చెలియలకట్ట అన్న నవలకు రేడియో అనుసరణ వ్రాశారు.[1]

పావని శాస్త్రి తన తండ్రి నవలలు అన్నీ కలిపి ఒక్కటే పెట్టెలో పెట్టి చదువరులకు అందిస్తూ, ఆ పెట్టె మీద "విశ్వనాథ వారి సంపూర్ణ నవలా నిధి" అని పేరు అచ్చు వేయించారు. ఆ నవలా నిధిలో 57 నవలలు, 54 పుస్తకాలు ఉన్నాయి.

తన తండ్రి విశ్వనాథ సత్యనారాయణ గారి సాహితీ రచనల కోసం పావనిశాస్త్రి విజయవాడ మారుతీనగర్ లో స్వంతంగా సాహిత్య గ్రంథాలయాన్ని స్థాపించాడు. అందులో విశ్వనాథ వారి 30 కవితలు, 20 నాటకాలు, 60 నవలలు, 10 సాహితీ విమర్శలు, 200 ఖండకావ్యాలు, 35 లఘు కథలు, 3 నాటికలు, 70 వ్యాసాలు, 50 రేడియో నాటికలు, 10 ఆంగ్ల వ్యాసాలు, 10 సంస్కృత రచనలు, 3 అనువాదాలు, 100 వివిధ పుస్తకాలకు ముందు మాటలు, రేడియో వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం అతని కుమారులు సత్యనారాయణ, శక్తిధర్ శ్రీ పవకి, మనోహర్ శ్రీ ఫణిని లు నిర్వహిస్తున్నారు.[2]

అతను 2006 లో విడుదలైన తెలుగు సినిమా పెళ్ళాం పిచ్చోడు కు కథను రాసాడు.[3]

మూలాలు మార్చు

  1. Ramana, Venkata (2016-01-26). "శోభనాచల: విశ్వనాధ వారి "చెలియలికట్ట" – రేడియో నాటిక". శోభనాచల. Retrieved 2020-07-23.
  2. Rao, G. Venkataramana (2015-11-16). "Protecting a 'temple of literature'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-09-13.
  3. "Pellam Pitchodu - Telugu Movie | TeluguJunction.com". www.telugujunction.com. Archived from the original on 2020-09-20. Retrieved 2020-09-13.