శుక్రేశ్వర దేవాలయం

శుక్రేశ్వర్ దేవాలయం భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో గల ఒక ప్రముఖ శివాలయం. ఈ ఆలయం గౌహతి నగరంలోని పన్‌బజార్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున శుక్రేశ్వర్ లేదా ఇటాఖులి కొండపై ఉంది. ఆలయ ప్రాంగణం నుండి నదికి పొడవైన మెట్ల మార్గం ఉంది. శుక్రేశ్వర్ ఘాట్ మెట్లపై కూర్చుని నదిలో సూర్యుడు అస్తమించే దృశ్యం చూడవచ్చు. ఈ ప్రాంతంలో ప్రజలు వారి పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారు. శివుని అతిపెద్ద లింగాలలో ఒకటి ఈ ప్రాంతంలో ఉంది.[1]

శుక్రేశ్వర దేవాలయం
శుక్రేశ్వర దేవాలయం is located in Assam
శుక్రేశ్వర దేవాలయం
Location in Assam
శుక్రేశ్వర దేవాలయం is located in India
శుక్రేశ్వర దేవాలయం
శుక్రేశ్వర దేవాలయం (India)
భౌగోళికం
భౌగోళికాంశాలు26°11′16″N 91°44′28″E / 26.1878049°N 91.7410059°E / 26.1878049; 91.7410059
దేశంభారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాకామ్రూప్ జిల్లా
ప్రదేశంగౌహతి
సంస్కృతి
దైవంమహాశివుడు
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తప్రమత్త సింహ[ఆధారం చూపాలి]

చరిత్ర మార్చు

ఈ ఆలయాన్ని 1744లో అహోం రాజు ప్రమత్త సింఘా (1744–1751) నిర్మించాడని నమ్ముతారు. శైవ ఆరాధనను ప్రోత్సహించిన రాజు రాజేశ్వర్ సింఘా (1751–69) 1759లో శుక్రేశ్వర ఆలయానికి ఆర్థిక కేటాయింపులు చేశాడు.[2]

గమనికలు మార్చు

  1. "Sukreswar Temple - History of Sukreswar Temple". www.mahashivratri.org. Retrieved 2022-02-03.
  2. "The Sukresvara and Janardana temples at Gauhati and Phakua Doul in the precincts of the Hayagriva-Madhava temple at Hajo were also built during (Pramatta Singha's) time." (Sarma 1981:177)
 
01.-శుక్రేశ్వర్ దేవాలయం 02
 
01.-శుక్రేశ్వర్ దేవాలయం 01
 
01.-శుక్రేశ్వర్ దేవాలయం 05

మూలాలు మార్చు