శ్రీశ్రీ ప్రస్థానత్రయం

శ్రీశ్రీ ప్రస్థానత్రయం అన్నది శ్రీశ్రీ సాహిత్వాన్ని కవితా ప్రస్థానం, కథన ప్రస్థానం, కదంబ ప్రస్థానం అను మూడు భాగాలుగా విభజించి సంకలనాలుగా మనసు ఫౌండేషన్ ప్రచురించిన సంకలన త్రయం.

ఆవిష్కరణ సభ మార్చు

ఈ పుస్తకాన్ని 2010 ఏప్రిల్ 30న శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ దీనిని స్వీకరించింది.[1] ఈ కార్యక్రమం హైదరాబాదులోన్ జూబ్లీహాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థాన గేయాలు, ఆయన ఉపన్యాసాలతో పాటు ఎంపిక చేసిన సినిమా పాటల సిడిని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిర్ంజీవి ఆవిష్కరించారు. [2]

మూలాలు మార్చు

  1. SELVI.M. "Srirangam Srinivasa Rao | Sri Sri prastanatrayam | Chiranjeevi | PRP | Congress | సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!". telugu.webdunia.com. Retrieved 2021-04-30.
  2. "Srisri Prasthanatrayam". MaNaSu FOUNDATION (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-27. Retrieved 2021-04-30.

బాహ్య లంకెలు మార్చు